సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, అనుబంధ మీడియా సంస్థల్లో వేగంగా కొనసాగుతున్న ప్రత్యేక ప్రచారం 5.0

ప్రత్యేక ప్రచారం 5.0 ద్వారా భారీ విజయాలను సాధించిన మంత్రిత్వశాఖ:

1.43 లక్షల కిలోల చెత్త తొలగింపు, 973 ప్రాంతాల్లో శుభ్రత, 14 వేల ఫైళ్ల సమీక్ష

స్వచ్ఛత, సామర్థ్యం, పెండింగ్ అంశాల పరిష్కారంపై మంత్రిత్వశాఖ నిబద్ధతకు

‘ప్రత్యేక ప్రచారం 5.0’ ఓ నిదర్శనం.

Posted On: 22 OCT 2025 1:56PM by PIB Hyderabad

సమాచారప్రసార మంత్రిత్వశాఖలో ప్రత్యేక ప్రచారం 5.0 జోరుగా సాగుతోందిస్వచ్ఛతను కొనసాగించడంపెండింగ్ పనులను తగ్గించడంకార్యనిర్వహణలో సమర్థతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

దేశవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలుక్షేత్రస్థాయి కార్యాలయాలతో కలిసి మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రచారం 5.0ను ఉత్సాహంగా అమలు చేస్తోందికార్యాలయాలను మరింత శుభ్రంగా ఉంచడంపెండింగ్ వ్యవహారాలను పరిష్కరించడంపనితీరును మెరుగుపరచడం ఈ ప్రచారంలోని ప్రధాన అంశాలు. 5.0 స్వచ్ఛతా కార్యక్రమాన్ని 2025 అక్టోబర్ 2న ప్రారంభించారుప్రచార సన్నాహక దశలో ఖరారు చేసిన లక్ష్యాలను సాధించేందుకు అంకితభావంతో ప్రయత్నాలు చేపట్టారు.

2025 అక్టోబర్ నుంచి అక్టోబర్ 17 వరకు జరిగిన ఈ ప్రచారంలో మంత్రిత్వ శాఖ సాధించిన ముఖ్య విజయాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

 

  • మంత్రిత్వ శాఖ 493 బహిరంగ ప్రచారాలను నిర్వహించింది. 973 ప్రదేశాలను శుభ్రం చేసింది. 104 వాహనాలను ఖండించింది.

  • సుమారు 1.43 లక్షల కిలోల తుక్కును తొలగించారు.  దీని ద్వారా 34.27 లక్షల ఆదాయం లభించడమే కాకుండా 8007 చదరపు అడుగుల స్థలం ఖాళీ అయ్యింది.

  • సుమారు 13900 ఫైళ్లను సమీక్షించారువాటిలో 3957 తొలగించారుమొత్తం 585 -ఫైళ్లను సమీక్షించగా.. వాటిలో 165 పూర్తిగా తొలగించారు.

  • ఇవే కాకుండా 301 ప్రజా సమస్యలు57 పీజీ అభ్యర్థనలు16 ఎంపీ సూచనలురాష్ట్ర ప్రభుత్వ సూచనలుపీఎంఓ సూచనను కూడా పరిష్కరించారు.

  • ప్రత్యేక ప్రచారం 5.0 కింద ప్రత్యక్షంగా కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించేందుకు మంత్రిత్వశాఖ నుంచి అధికారులను వివిధ క్షేత్ర కార్యాలయాలకు పంపించారు.

 

మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రచారం 5.0 లక్ష్యాలపై అంకితభావంతో కొనసాగుతోందిఈ ప్రచారం ద్వారా కార్యాలయాల శుభ్రతను మెరుగుపరచడంపని సామర్థ్యాన్ని పెంచడంస్వచ్ఛతను స్థిరంగా కొనసాగించడంపెండింగ్ వ్యవహారాలను సకాలంలో పరిష్కరించడంబాధ్యతాయుతమైన ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రోత్సాహందేశ పరిశుభ్రత,  స్థిరత్వానికి దోహదపడటం వంటి కీలక అంశాలపై మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది.

ప్రచారానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు:

 

1. పీఐబీ  ఇంఫాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం 5.0 ద్వారా ఓ పాఠశాలలో స్వచ్ఛతా కార్యక్రమం  నిర్వహించారుఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో  వ్యక్తిగత పరిశుభ్రతపాఠశాల పరిసరాల శుభ్రతపై అవగాహనసామూహిక బాధ్యత భావనను ప్రోత్సహించారు.

 

2. శాస్త్రి భవన్‌లోని రికార్డు గదిమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలలో శుభ్రతడిజిటలైజేషన్ఫైళ్ల తొలగింపు పనులను సమాచారప్రసార మంత్రిత్వ శాఖ నోడల్ అధికారిసీనియర్ ఆర్థిక సలహాదారు ఆర్కేజెనా పరిశీలించారు.

 

***

 


(Release ID: 2181627) Visitor Counter : 10