ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా కప్-2025లో భారత పురుషుల హాకీ జట్టు అసాధారణ విజయం.. ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 08 SEP 2025 7:20AM by PIB Hyderabad

బీహార్‌లోని రాజ్‌గీర్‌లో నిర్వహించిన ఆసియా కప్-2025లో అద్భుత గెలుపును సొంతం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘‘గతంలో విజేతలైన దక్షిణ కొరియా జట్టుపై ఆధిపత్యాన్ని సాధించిన కారణంగా ఈ విజయం మరింత ప్రత్యేకమైంద’’ని శ్రీ మోదీ అభివర్ణించారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘
బీహార్‌లోని రాజ్‌గీర్‌లో నిర్వహించిన ఆసియా కప్-2025లో మన పురుషుల జట్టు వైభవోపేత విజయాన్ని చేజిక్కించుకొన్నందుకు ఇవే అభినందనలుగతంలో విజేతగా ఉన్న దక్షిణ కొరియాపై వారు పైచేయి సాధించారు కాబట్టిఈ గెలుపు మరింత గొప్పది.

భారత హాకీనే కాక భారతీయ క్రీడారంగం కూడా ఎంతో సంతోషించదగ్గ ఘడియ ఇదిమన క్రీడాకారులు తరచూ విజయాలను అందుకుంటూదేశానికి మరింత కీర్తిని సంపాదించి పెట్టాలని నేను ఆకాంక్షిస్తున్నాను.’’

 

***


(రిలీజ్ ఐడి: 2164694) సందర్శకుల సూచీ సంఖ్య : : 29