ప్రధాన మంత్రి కార్యాలయం

త్రిపుర రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 21 JAN 2024 9:27AM by PIB Hyderabad

   త్రిపుర రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య భారతంలోని ఈ రాష్ట్రం భవిష్యత్తులో సమున్నత ప్రగతి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:

‘‘త్రిపుర ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ రాష్ట్ర విశిష్ట చరిత్ర, ఘన వారసత్వ వేడుకలను ఘనంగా నిర్వహించుకోండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారంతా సామరస్యంతో జీవించేలా ఆశీస్సులివ్వాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/RT



(Release ID: 1998312) Visitor Counter : 114