ప్రధాన మంత్రి కార్యాలయం

ముంబయి లోని మలాడ్ పశ్చిమ లో ఒక కట్టడం కూలిన కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


బాధితుల కు పరిహారాన్ని ప్రకటించారు

Posted On: 10 JUN 2021 2:36PM by PIB Hyderabad

ముంబయి లోని మలాడ్ పశ్చిమ లో ఒక కట్టడం కూలిన కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.  

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో:

‘‘ముంబయి లోని మలాడ్ పశ్చిమ లో ఒక కట్టడం కూలిపోయి ప్రాణనష్టం సంభవించడం దు:ఖాన్ని కలిగించింది.  ఆప్తుల ను ఎడబాసిన కుటుంబాల కు ఈ దు:ఖ ఘడియ లో నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.  ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి అని ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి’’

అని పేర్కొన్నారు.

 


మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి తాలూకు దగ్గరి బంధువుల కు పిఎమ్ఎన్ ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రధాన మంత్రి ప్రకటించారు.  గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది.


******

DS



(Release ID: 1726043) Visitor Counter : 135