ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రికి స్లొవేక్ రిపబ్లిక్ అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఫస్ట్ క్లాస్’’ ప్రదానం
प्रविष्टि तिथि:
15 JUN 2026 11:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్లొవేకియా అత్యున్నత జాతీయ పురస్కారమైన "ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఫస్ట్ క్లాస్"ను ఆ దేశాధ్యక్షులు శ్రీ పీటర్ పెల్లెగ్రినీ ప్రదానం చేశారు.
తనకు విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసిన స్లొవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, ప్రజలకు ప్రధానమంత్రి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పురస్కారాన్ని స్వీకరిస్తూ.. ఇది భారతదేశంలోని 1.4 బిలియన్ల మంది ప్రజలకూ, భారత్, స్లొవేకియా మధ్య స్నేహ సంబంధాలకూ దక్కిన గౌరవమన్నారు.
భారత్, స్లొవేకియా ప్రజలను ఏకం చేసి ఉంచుతున్న ఆత్మీయత, విశ్వాసం, ప్రేమకు చిహ్నంగా ఈ పురస్కారాన్ని ప్రధానమంత్రి వర్ణించారు. రెండు దేశాల్లోని భవిష్యత్తు తరాలు తమ మధ్య ఉన్న ప్రత్యేక స్నేహ సంబంధాన్ని కొనసాగించేలా స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 2273464)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam