ప్రధాన మంత్రి కార్యాలయం
ఈ పరీక్షల వేళ మిత్రులు-తల్లిదండ్రుల మధ్య సమతుల వాతావరణం సృష్టించాలని సూచిస్తూ ఓ కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 JAN 2026 1:53PM by PIB Hyderabad
ఈ ఏడాది పరీక్షల సమయంలో మిత్రులు-తల్లిదండ్రుల మధ్య సమతుల వాతావరణం సృష్టించాలని సూచిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో ఓ కథనాన్ని పంచుకున్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి పోస్టుపై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశాన్ని ఆయన కార్యాలయం (పీఎంఓ) కింది విధంగా పేర్కొంది:
“విద్యాభ్యాసం, పరీక్షలలో ఒత్తిడిని జయిద్దాం రండి!
మన సామర్థ్యానికి మార్కులు, అంచనాలు కొలబద్దలు కారాదు... అవి మార్గనిర్దేశకాలు మాత్రమే. కాబట్టి, మిత్రులు-తల్లిదండ్రుల మధ్య సమతుల వాతావరణ సృష్టికి యత్నించాలని సూచిస్తూ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి @jayantrld ఒక వ్యాసం రాశారు. ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన వ్యాసమిది!” అని ప్రధానమంత్రి సూచించినట్లు ‘పీఎంఓ’ వివరించింది.
***
(रिलीज़ आईडी: 2214991)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam