ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈశాన్య భారతం మార్పు చెందడంపై వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని

Posted On: 28 MAY 2025 1:18PM by PIB Hyderabad

కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి, ఈశాన్య ప్రాంత శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు షేర్ చేశారు. ఈశాన్య భారతం ఇక ఒక సరిహద్దు ఎంతమాత్రం కాదు, అది అగ్రగామి అంటూ శ్రీ మోదీ అభివర్ణించారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో:


‘‘భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం ఇక ఎంతమాత్రం ఒక సరిహద్దు కానే కాదు, అది అగ్రగామిగా నిలిచింది. ఈ ప్రాంతం వాణిజ్యానికి, సంధానానికి కూడలిగా ఎదగడాన్ని గురించి, అలాగే మన దేశాన్ని ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్)గా తీర్చిదిద్దే క్రమంలో 30 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన ఇండియాను ఆవిష్కరించడానికి సంబంధించిన దృష్టికోణాన్ని గురించి వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా (@JM_Scindia) ఒక వ్యాసాన్ని రాశారు. ఆ వ్యాసాన్ని చదవగలరు’’ అని పేర్కొంది.


(Release ID: 2131978) Visitor Counter : 2