ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

రజతం సాధించిన అజిత్ సింగ్ ను అభినందించిన ప్రధానమంత్రి

Posted On: 04 SEP 2024 10:22AM by PIB Hyderabad

పారిస్ లో జరుగుతన్న పారాలింపిక్స్ 2024 క్రీడల్లో రజతం సాధించిన అజిత్ సింగ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో అజిత్ సింగ్ ఈ పతకం సాధించారు.

‘‘పారాలింపిక్స్ 2024 క్రీడల్లో జావెలిన్ త్రో ఎఫ్ 46 లో అజిత్ సింగ్ అద్భుత ప్రదర్శన చేసి రజతం సాధించారు. క్రీడల పట్ల ఆయనకున్న నిబద్దత, పట్టుదల భారత్ ను గర్వపడేలా చేసింది. #Cheer4Bharat’’ అని ‘ఎక్స్’ లో ప్రధాని పోస్ట్ చేశారు.

 

 

***

MJPS/ST



(Release ID: 2051720) Visitor Counter : 31