ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుహాస్ యతిరాజ్ కు ప్రధాని అభినందనలు

Posted On: 02 SEP 2024 11:35PM by PIB Hyderabad

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో రజతం సాధించిన సుహాస్ యతిరాజ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ  ఈరోజు అభినందించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్ 4 విభాగంలో సుహాస్ ఈ పతకం సాధించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో శ్రీ మోదీ ‘‘పారాలింపిక్స్ లో పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 బ్యాడ్మింటన్ విభాగంలో సుహాస్ యతిరాజ్ రజతం సాధించడం అద్భుతమైన విజయం. ఈ గెలుపు భారత్ కు సంతోషం కలిగించింది. క్రీడల పట్ల ఆయన  పట్టుదల, నిబద్ధతకు మేం గర్విస్తున్నాం.  @suhas_ly #Cheer4Bharat"



(Release ID: 2051243) Visitor Counter : 40