ప్రధాన మంత్రి కార్యాలయం

జన్ ధన్ యోజన తెచ్చిన మార్పులను ప్రముఖంగా చాటిచెబుతూ లింక్డ్ ఇన్ (LinkedIn) లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం

Posted On: 28 AUG 2024 3:17PM by PIB Hyderabad

జన్ ధన్ యోజనకు పదేళ్ళు పూర్తి అయినట్లు తెలియజేస్తూ  సామాజిక ప్రసార మాధ్యమాల వేదిక లింక్డ్ఇన్ (LinkedIn) లో  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక సందేశాన్ని పొందుపరిచారు.  

‘ఎ డెకేడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్  - ది పిఎమ్ జన్ ధన్ యోజన’ (అందరికీ ఆర్థిక సేవల చేరవేతకు పదేళ్ళు - పిఎమ్ జన్ ధన్ యోజన) శీర్షిక తో ఉన్న ప్రధాని సందేశం, ఈ కార్యక్రమంతో సమాజానికి ఒనగూరిన పరివర్తన ప్రధాన ఫలితాలను ప్రముఖంగా ప్రస్తావించింది.

ప్రధాని ‘ఎక్స్’ మాధ్యమం లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘జన్ ధన్ యోజన అనేది ఆత్మగౌరవం, సాధికారిత కల్పన,  అవకాశాలకు సంబంధించిన పథకం.  ఈ రోజున, మనం ‘పదేళ్ళ జన్ ధన్’ (#10YearsOfJanDhan) ను జరుపుకొంటున్న సందర్భంగా, ఈ కార్యక్రమం వల్ల దక్కిన ప్రముఖ విజయాలను ప్రస్తావిస్తూ నేను లింక్డ్ఇన్ (@LinkedIn) లో రాసిన ఒక సందేశాన్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను.’’

***

 

MJPS/RT



(Release ID: 2049372) Visitor Counter : 40