ప్రధాన మంత్రి కార్యాలయం
జన్ ధన్ యోజన తెచ్చిన మార్పులను ప్రముఖంగా చాటిచెబుతూ లింక్డ్ ఇన్ (LinkedIn) లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం
Posted On:
28 AUG 2024 3:17PM by PIB Hyderabad
జన్ ధన్ యోజనకు పదేళ్ళు పూర్తి అయినట్లు తెలియజేస్తూ సామాజిక ప్రసార మాధ్యమాల వేదిక లింక్డ్ఇన్ (LinkedIn) లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక సందేశాన్ని పొందుపరిచారు.
‘ఎ డెకేడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ - ది పిఎమ్ జన్ ధన్ యోజన’ (అందరికీ ఆర్థిక సేవల చేరవేతకు పదేళ్ళు - పిఎమ్ జన్ ధన్ యోజన) శీర్షిక తో ఉన్న ప్రధాని సందేశం, ఈ కార్యక్రమంతో సమాజానికి ఒనగూరిన పరివర్తన ప్రధాన ఫలితాలను ప్రముఖంగా ప్రస్తావించింది.
ప్రధాని ‘ఎక్స్’ మాధ్యమం లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘జన్ ధన్ యోజన అనేది ఆత్మగౌరవం, సాధికారిత కల్పన, అవకాశాలకు సంబంధించిన పథకం. ఈ రోజున, మనం ‘పదేళ్ళ జన్ ధన్’ (#10YearsOfJanDhan) ను జరుపుకొంటున్న సందర్భంగా, ఈ కార్యక్రమం వల్ల దక్కిన ప్రముఖ విజయాలను ప్రస్తావిస్తూ నేను లింక్డ్ఇన్ (@LinkedIn) లో రాసిన ఒక సందేశాన్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను.’’
***
MJPS/RT
(Release ID: 2049372)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam