ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియన్ పారా గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్-క్లాస్ 1 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన సందీప్ డాంగిని అభినందించిన ప్రధానమంత్రి

Posted On: 25 OCT 2023 4:36PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్  2022లో టేబుల్  టెన్నిస్ పురుషుల సింగిల్స్-క్లాస్ 1 ఈవెంట్  లో కాంస్య పతకం సాధించిన సందీప్  డాంగిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఆయన ఈ మేరకు ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘టేబుల్  టెన్నిస్ పురుషుల సింగిల్స్-క్లాస్ 1 ఈవెంట్  లో కాంస్య పతకం సాధించి సందీప్  డాంగి అద్భుతం చేశాడు. అతను ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం, అంకితభావం జాతికి గౌరవం తెచ్చాయి. భారతదేశం ఈ విజయాన్ని ఆస్వాదిస్తోంది’’ అని పేర్కొన్నారు.  



(Release ID: 1971897) Visitor Counter : 91