ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్హెచ్-6’లో కాంస్య పతక విజేతలు నిత్యశ్రీ శివన్.. రచనా పటేల్లకు ప్రధాని ప్రశంస

Posted On: 26 OCT 2023 9:01PM by PIB Hyderabad

   సియా పారాగేమ్స్‌ మహిళల ‘బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్‌హెచ్‌-6’లో కాంస్య పతక విజేతలు నిత్యశ్రీ శివన్, రచనా పటేల్‌ జంటను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ మహిళల ‘బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్‌హెచ్‌-6’లో కాంస్యం సాధించిన నిత్యశ్రీ శివన్‌, రచనా పటేల్‌ @07nithyasre and Rachana Patelకు అభినందనలు. అసమాన నైపుణ్యం, సమష్టి కృషితో కూడిన శక్తిమంతమైన ప్రతిభా ప్రదర్శనతో వారు ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ జంట మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1971847) Visitor Counter : 99