ప్రధాన మంత్రి కార్యాలయం

పారా ఆసియా క్రీడలు - 2022లో పురుషుల హై జంప్ టి64 ఈవెంట్‌లో ఉన్ని రేణు కాంస్య పతకాన్ని సాధించినందుకు ప్రధాన మంత్రి అభినందనలు

Posted On: 23 OCT 2023 6:48PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడలు 2022లో పురుషుల హైజంప్ టి64 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఉన్ని రేణును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంగా పోస్ట్ చేస్తూ... 

“పురుషుల హైజంప్ టి64 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించినందుకు ఉన్ని రేణుకు అభినందనలు. అతని పట్టుదల, అసాధారణమైన ప్రదర్శన మన దేశానికి గర్వకారణం" అని ప్రధాని ప్రశంసించారు.



(Release ID: 1970885) Visitor Counter : 60