ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల స్క్వాష్ పురుషుల సింగిల్స్లో రజత పతక విజేత సౌరవ్ ఘోషల్కు ప్రధాని అభినందన

Posted On: 05 OCT 2023 9:05PM by PIB Hyderabad

   సియా క్రీడల స్క్వాష్‌ పురుషుల సింగిల్స్‌లో రజత పతకం సాధించిన సౌరవ్‌ ఘోషల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“స్క్వాష్‌ పురుషుల సింగిల్స్‌లో రజత పతకం సాధించిన మన అసమాన ఆటగాడు సౌరవ్‌ ఘోషల్‌ @SauravGhosalకు అభినందనలు. ఆతడు ప్రదర్శించిన అద్భుత ప్రతిభ, పట్టుదల ఈ విజయం సాధించిపెట్టాయి. క్రమశిక్షణ, అంకిత భావం, మొక్కవోని పట్టుదల అతన్ని పోడియం స్థాయికి చేర్చయనడంలో సందేహం లేదు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1964888) Visitor Counter : 78