ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ అంకుర పురస్కారాలు-2023 కోసం దరఖాస్తు చేసుకోండి: ఆవిష్కర్తలకు ప్ర‌ధానమంత్రి పిలుపు

Posted On: 08 APR 2023 11:37AM by PIB Hyderabad

   జాతీయ అంకుర పురస్కారాలు-2023 కోసం ఆవిష్కర్తలు దరఖాస్తు చేసుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“అంకుర సంస్థలు ఆవిష్కరణోత్సాహం దృష్ట్యా మాత్రమే కాకుండా వాటి వ్యవస్థాపకుల స్పూర్తిదాయక జీవన ప్రయనం దృష్ట్యా కూడా ఆకట్టుకుంటాయి. మా ‘అంకుర’ పదమే మన యువ శక్తి స్ఫూర్తిని వ్యక్తీకరిస్తుంది. అందుకే ఆవిష్కర్తలు జాతీయ అంకుర సంస్థల పురస్కారాలు-2023కు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాను startupindia.gov.in” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


***

DS



(Release ID: 1914893) Visitor Counter : 182