ప్రధాన మంత్రి కార్యాలయం

డెయిరీ రంగంలో ప్రగతిపై ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 28 NOV 2022 1:05PM by PIB Hyderabad

   పాడి పరిశ్రమ రంగంలో పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు కేవలం గత ఎనిమిదేళ్లలో పాల దిగుబడిలో వృద్ధి 83 టన్నులు కాగా, లోగడ 63 ఏళ్ల కాలంలో వృద్ధి 121 టన్నులు కావడం గమనార్హమని ఆయన పేర్కొన్నారు.

ఈ అంశంపై కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా చేసిన ట్వీట్‌పై ప్ర‌ధాని స్పందిస్తూ-

“ఇది ఎంతో సంతోషించదగిన ప్రత్యేక సందర్భం. మన నారీశక్తిని మరింత బలోపేతం కావడానికి శక్తిమంతమైన పాడి రంగం కూడా గొప్ప ఉపకరణం. రానున్న కాలంలో ఈ రంగం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

*****

DS



(Release ID: 1879876) Visitor Counter : 93