ప్రధాన మంత్రి కార్యాలయం
డెయిరీ రంగంలో ప్రగతిపై ప్రధానమంత్రి ప్రశంస
Posted On:
28 NOV 2022 1:05PM by PIB Hyderabad
పాడి పరిశ్రమ రంగంలో పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు కేవలం గత ఎనిమిదేళ్లలో పాల దిగుబడిలో వృద్ధి 83 టన్నులు కాగా, లోగడ 63 ఏళ్ల కాలంలో వృద్ధి 121 టన్నులు కావడం గమనార్హమని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశంపై కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా చేసిన ట్వీట్పై ప్రధాని స్పందిస్తూ-
“ఇది ఎంతో సంతోషించదగిన ప్రత్యేక సందర్భం. మన నారీశక్తిని మరింత బలోపేతం కావడానికి శక్తిమంతమైన పాడి రంగం కూడా గొప్ప ఉపకరణం. రానున్న కాలంలో ఈ రంగం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
*****
DS
(Release ID: 1879876)
Visitor Counter : 93
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam