ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్‌క‌ల్యాణ్ అన్న యోజ‌న కింద స‌బ్ కా వికాస్ మహా క్విజ్‌లో పాల్గ‌న‌వ‌ల‌సిందిగా ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 14 APR 2022 9:07PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న‌యోజ‌న పై స‌బ్ కా వికాస్ మ‌హా క్విజ్ లో పాల్గొన‌వ‌ల‌సిందిగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇది ఆస‌క్తిక‌ర‌మైన క్విజ్ అని, ఇది సుప‌రిపాల‌న‌కు సంబంధించిన ప‌లు అంశాల‌ను క‌వ‌ర్ చేస్తుంద‌ని అన్నారు. మై గ‌వ్ ఇండియా ట్వీట్ కు స్పందిస్తూ ప్ర‌ధాన‌మంత్రి ట్వీట్ చేస్తూ.....
 "ఇది ఒక ఆస‌క్తి దాయ‌క క్విజ్‌, ఇందులో సుప‌రిపాల‌న‌కు సంబంధించి తీసుకున్న ప‌లు చ‌ర్య‌లు ఉన్నాయి. స‌బ్ కా వికాస్ మ‌హా క్విజ్ లోమీరూ పాల్గొనండి.ఆ విధంగా స‌మ్మిళిత అభివృద్ధికి సాగిస్తున్న స‌మ‌ష్ఠి కృషిని బ‌లోపేతం చేయండి" అని ఆయ‌న అన్నారు

 

 



(Release ID: 1817514) Visitor Counter : 113