ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌పంచ రెజ్లింగ్ ఛాంపియ‌న్‌షిప్ లో ప‌త‌కాలు సాధించినందుకు అన్షుమాలిక్‌, స‌రితా మోర్‌ల‌ను అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 10 OCT 2021 7:25PM by PIB Hyderabad

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియ‌న్‌షిప్ 2021 పోటీల‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన అన్షు మాలిక్‌ను, కాంస్య ప‌త‌కం సాధించిన స‌రితా మోర్‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అభినందించారు.
ఇందుకు సంబంధించి ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశమిస్తూ ప్ర‌ధాన‌మంత్రి,
"  ప్ర‌పంచ రెజ్లింగ్ ఛాంపియ‌న్ షిప్ 2021 లో ర‌జ‌త ప‌త‌కం సాధించినందుకు ఒలి అన్షుకు , కాంస్య ప‌త‌కం సాధించినందుకు  స‌రితా మోర్‌కు అభినంద‌న‌లు, అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన  ఈ క్రీడాకారుల భ‌విష్య‌త్ ప్ర‌య‌త్నాల‌కు శుభాభినంద‌న‌లు "  అని పేర్కొన్నారు.

***

DS/AK



(Release ID: 1762805) Visitor Counter : 135