ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారీగా పెరిగిన కోవిడ్ పరీక్షలు; 15 కోట్లు దాటిన మొత్తం పరీక్షలు

గత 10 రోజుల్లోనే కోటి పరీక్షలు

11 రోజులుగా రోజూ కొత్త కేసులు 40,000 లోపు

ఐదురోజులుగా రోజువారీ మరణాలు 500 లోపు

Posted On: 10 DEC 2020 10:35AM by PIB Hyderabad

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మీద పొరులో భారతదేసం మరో మైలురాయి దాటింది. ఇప్పటివరకు మొత్తం 15 కోట్ల కోవిడ్ పరీక్షలు జరిపింది. గత 24 గంటలలోనే 9,22,959  శాంపిల్స్ పరీక్షించింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య  15,07,59,726 కి చేరింది చివరి కోటి పరీక్షలు గడిచిన 10 రోజుల్లొనే జరిగాయి.  సమగ్రంగా విస్తృతంగా పరీక్షలు జరుపుతూ రావటం వలన పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.

 

WhatsApp Image 2020-12-10 at 10.10.34 AM.jpeg

వరుసగా 11 రోజులుగా కొత్త పాజిటివ్ కేసులు 40 వేల లోపే ఉండటం ద్వారా భారత్ మరో విజయం సాధించినట్టయింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కేవలం  31,521 కొత్త పాజిటివ్ కేసులు మాత్రమే నిర్థారణ జరిగాయి.

 

WhatsApp Image 2020-12-10 at 10.10.50 AM.jpeg

ఇదే 24 గంటల సమయంలో దేశవ్యాప్తంగా  37,725 మంది కొత్తగా కోలుకొని కోవిడ్ నుంచి బైటపడ్దారు. దీంతో చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య మరికొంత తగ్గింది. ప్రస్తుతం దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 3,72,293 కాగా, ఇది దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో 3.81%

 

WhatsApp Image 2020-12-10 at 10.04.07 AM.jpeg

ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 92.5 లక్షలు దాటి  నేటికి 92,53,306 చేరింది. కోలుకున్నవారి శాతం  94.74% కి పెరిగింది. నమోదైన కేసులకూ, చికిత్సలో ఉన్న కేసులకూమధ్య తేడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.  ప్రస్తుతం ఆ తేడా 88,81,013 గా నమోదైంది. కొత్తగా కోలుకున్నవారిలో 77.30% కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే చెందినవారున్నారు.   మహారాష్టలో అత్యధికంగా  5,051 మంది కోలుకోగా, కేరళలో 4647 మంది, ఢిల్లీలో  4,177 మంది కోలుకున్నారు.

WhatsApp Image 2020-12-10 at 9.58.28 AM.jpeg

కొత్తగా పాజిటివ్ గా తేలిన కేసులలో 74.65% కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి. మహారాష్ట్రలో అత్యధికంగా 4,981 కేసులు, కేరళలో 4,875, పశ్చిమ బెంగాల్ లో  2,956 కేసులు వచ్చాయి.  

WhatsApp Image 2020-12-10 at 9.58.25 AM.jpeg

గడిచిన 24 గంటలలో 412 మరణాలు నమోదు కాగా, అందులో 77.67%  కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే నమోదయ్యాయి.  18.20% (75) మరణాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా 50 మరణాలతో ఢిల్లీ వాటా 12.13% ఉంది. 

WhatsApp Image 2020-12-10 at 9.58.26 AM.jpeg

గత ఐదు రోజులుగా రోజువారీ మరణాల సంఖ్య 500 లోపే ఉంటూ వస్తున్నది. 

WhatsApp Image 2020-12-10 at 10.13.53 AM.jpeg

 

****



(Release ID: 1679670) Visitor Counter : 190