ప్రధాన మంత్రి కార్యాలయం

వివిధ పండుగల సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 14 APR 2020 10:20AM by PIB Hyderabad

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగల వేళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు “భారతదేశమంతటా పర్వదిన సంబరాలు సాగుతున్న నేపథ్యంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఈ పండుగల వేళ దేశవ్యాప్తంగా సౌభ్రాత్ర స్ఫూర్తి నిండాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా అందరికీ సుఖసంతోషాలతోపాటు మంచి ఆరోగ్యం సిద్ధించాలని ప్రార్థిస్తున్నాను. రాబోయే రోజుల్లో కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో మన సామూహిక శక్తి మరింత ఇనుమడించాలని కోరుకుంటున్నాను. ‘శుభో నబో బర్షో!’ (కొత్త సంవత్సరంలో శుభం కలగాలి), ‘పొయిలా బొయిషాఖి’ (వైశాఖి సంవత్సరాది) శుభాకాంక్షలు’. ఏడాదంతా అద్భుతంగా సాగాలి... ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో, సౌభాగ్యంతో విలసిల్లాలి. అందరికీ ‘విషు’ శుభాకాంక్షలు! ఈ కొత్త సంవత్సరంలో క్రొంగొత్త శక్తి, ఆశాభావాలు ఉద్భవించాలి. రాబోయే ఏడాది అందరి జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును నింపాలి.  అందరికీ ‘పుత్తాండు’ (నూతన సంవత్సరం) శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా సంతోషంతో, ఆరోగ్య సౌభాగ్యంతో వర్ధిల్లాలి. ‘బోహాగ్‌ బిహు’ శుభాకాంక్షలు’’ అని వివిధ రాష్ట్రాల ప్రజలకు ఆయా భాషల్లో ట్విట్టర్‌ద్వారా ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.



(Release ID: 1614254) Visitor Counter : 91