ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ప్రధానితో బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి భేటీ
प्रविष्टि तिथि:
04 JUN 2026 9:37PM by PIB Hyderabad
బ్రిటన్ విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్ ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
ఈ సమావేశం పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇరుదేశాలకు మునుపెన్నడూ లేనివిధంగా విస్తృతమైన అభివృద్ధి అవకాశాలను అందిస్తున్న భారత్ - బ్రిటన్ భాగస్వామ్యం ఇటీవలి కాలంలో బలోపేతమవడాన్ని ఆయన అభినందించారు.
భారత్ - యూకే విజన్ 2035 నిరంతర మార్గనిర్దేశంలో ఈ భాగస్వామ్యం ఇలాగే కొనసాగుతుందని, ప్రపంచ శ్రేయస్సు దిశగా ఉమ్మడి కృషిని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘బ్రిటన్ విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్ను కలవడం ఆనందంగా ఉంది. ఇటీవలి కాలంలో భారత్ - బ్రిటన్ భాగస్వామ్యం బలోపేతమవడం అభినందనీయం. మన రెండు దేశాలకూ మునుపెన్నడూ లేనంత విస్తృతంగా అభివృద్ధి అవకాశాలను ఈ భాగస్వామ్యం అందిస్తోంది.
భారత్ - యూకే విజన్ 2035 మార్గనిర్దేశంలో మన భాగస్వామ్యం నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రపంచ శ్రేయస్సు దిశగా మన ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది’’.
***
(रिलीज़ आईडी: 2269179)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam