ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ సినీనటి బి. సరోజాదేవి మృతి పట్ల ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
14 JUL 2025 3:40PM by PIB Hyderabad
ప్రముఖ సినీతార బి. సరోజా దేవి మరణంపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
భారతీయ సినిమా, సంస్కృతికి ప్రతీకగానూ, అసాధారణ నటిగానూ ఆమె గుర్తుండిపోతారని శ్రీ మోదీ అన్నారు. ఆమె తన నటవైవిధ్యంతో అన్ని తరాలపైనా చెరగని ముద్ర వేశారని కొనియాడారు. వివిధ భాషల్లో, అనేక ఇతివృత్తాల్లో నటన ద్వారా ఆమె బహుముఖీన ప్రజ్ఞను ప్రదర్శించారని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ప్రముఖ సినీనటి బి. సరోజాదేవి గారి మరణం బాధాకరం. భారతీయ సినిమా, సంస్కృతికి ప్రతీకగా, ఒక అసాధారణ నటిగా ఆమె గుర్తుండిపోతారు. ఆమె తన నటవైవిధ్యంతో అన్ని తరాలపైనా చెరగని ముద్ర వేశారు. వివిధ భాషల్లో, అనేక ఇతివృత్తాల్లో ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. ఆమె కుటుంబానికీ, అభిమానులకూ నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.”
(रिलीज़ आईडी: 2144549)
आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam