హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపునకు ఆమోదం కోరుతూ లోక్ సభలో చట్టబద్ధ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


మణిపూర్‌ హింసలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన సభ

మణిపూర్ హైకోర్టు నిర్ణయం దరిమిలా.. రిజర్వేషన్లకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం, మణిపూర్‌లో జాతుల ఘర్షణ

మణిపూర్‌లో గత నాలుగు నెలలుగా హింస లేదు

సహాయక శిబిరాల్లో ఆహారం, మందులు, వైద్య సేవలు సహా అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తున్న ప్రభుత్వం

సాంకేతిక విద్య, వైద్య విద్య కోసం ఆన్‌లైన్ ఏర్పాట్లు

ప్రాథమిక విద్య కోసం శిబిరాల్లోనే తరగతులు

హింసకు తావివ్వొద్దు, జాతి హింసను ఏ రాజకీయ పార్టీతోనూ ముడిపెట్టొద్దు: హోంమంత్రి

మణిపూర్ లో చాలా కాలంగా అశాంతి ఉంది.. కానీ, అక్కడ హింస ఇదే మొదటిసారి అన్నట్టుగా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయి

గత ప్రభుత్వ హయాంలో 1993 తర్వాత మణిపూర్‌లో మూడు సార్లు భారీగా జాతుల ఘర్షణలు: ఒకటి పదేళ్లు, ఇంకొకటి మూడేళ్లు, మరో ఘర్షణ ఆరు నెలలపాటు కొనసాగినప్పటికీ.. హోం మంత్రి సహా ప్రభుత్వం నుంచి ఎవ్వరూ ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు

జాతి హింస లేకపోయినా 2012, 2017 మధ్య ఏటా సగటున 212 రోజుల పాటు మణిపూర్ స్తబ్ధంగానే ఉండిపోయింది

హైకోర్టు ఆదేశానికి ముందు.. మా హయాంలో మణిపూర

Posted On: 03 APR 2025 4:21PM by PIB Hyderabad

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపునకు ఆమోదం కోసం కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా లోక్‌సభలో ఓ చట్టబద్ధమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టారుదిగువ సభ ఈ తీర్మానాన్ని ఆమోదించిందిమణిపూర్‌లో జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల సభ సానుభూతినిప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది.

తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. రిజర్వేషన్ సంబంధిత వివాదంపై మణిపూర్ హైకోర్టు నిర్ణయం దరిమిలా మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య జాతి ఘర్షణ మొదలైందన్నారుఇవి అల్లర్లోఉగ్రవాద చర్యలో కావనిహైకోర్టు తీర్పును అన్వయించుకున్న తీరుభిన్న వ్యాఖ్యానాల ఫలితంగా ఇరువర్గాల మధ్య జరిగిన జాతి హింస అని పేర్కొన్నారుడిసెంబర్ నుంచి మార్చి వరకు దాదాపు నాలుగు నెలలుగా మణిపూర్‌లో ఎలాంటి హింసా జరగలేదని.. సహాయక శిబిరాలలో ఆహారంఔషధాలువైద్య సదుపాయాలను అందిస్తున్నామని శ్రీ అమిత్ షా తెలిపారుసాంకేతికవైద్య విద్యల కోసం ఆన్‌లైన్ ద్వారానూ.. అలాగే ప్రాథమిక విద్య కోసం శిబిరాల్లోనే తరగతులను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

ఎటువంటి హింసకు తావివ్వవద్దనిజాతి హింసను ఏ రాజకీయ పార్టీతోనూ ముడిపెట్టకూడదని శ్రీ అమిత్ షా అన్నారుతమ పాలనలోనే జాతి హింస జరిగినట్లు చిత్రీకరించేలా ప్రతిపక్షాలు ప్రయత్నించాయని విమర్శించారు1993-1998 మధ్య మణిపూర్‌లో ఐదేళ్లపాటు నాగా – కుకీ ఘర్షణ కొనసాగిందనిఇందులో 750 మంది మరణించారని ఆయన సభకు తెలిపారుదీనివల్ల మరో దశాబ్దం పాటు అక్కడక్కడా ఉధ్రిక్త ఘటనలు కూడా జరిగాయన్నారుతమ పాలనలో ఇలాంటి ఘటనలను జరగనీయొద్దని కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ.. దురదృష్టవశాత్తూ ఓ నిర్ణయం హింసకు దారితీసిందనిదానినీ వెంటనే అదుపులోకి తెచ్చామని శ్రీ అమిత్ షా అన్నారుహింసలో 260 మంది ప్రాణాలు కోల్పోయారనిఅందులో 80 శాతం మొదటి నెలలోనే మృతిచెందగామిగిలిన వ్యక్తులు తరువాతి నెలల్లో మృత్యువాత పడ్డారని తెలిపారు1997-98 కుకి-పైట్ ఘర్షణలో 50కి పైగా గ్రామాలు నాశనమయ్యాయని, 40,000 మంది నిరాశ్రయులయ్యారని, 352 మంది మరణించారనివందలాది మంది గాయపడ్డారని, 5,000 ఇళ్లు కాలిపోయాయని కూడా ఆయన ప్రస్తావించారు1993లో ఆరు నెలల పాటు జరిగిన మెయిటీ-పంగల్ ఘర్షణలోనూ 100 మందికి పైగా మరణించారని ఆయన చెప్పారు.

మణిపూర్ లో హింస ఇదే మొదటిసారి అన్నట్టుగాతమ పాలన విఫలమైందన్నట్టుగా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయని హోం మంత్రి విమర్శించారుగత ప్రభుత్వ హయాంలో మణిపూర్‌లో మూడు సార్లు భారీగా జాతుల ఘర్షణలుఒకటి పదేళ్లుఇంకొకటి మూడేళ్లుమరో ఘర్షణ ఆరు నెలలపాటు కొనసాగాయని అన్నారుఈ హింసాత్మక ఘటనల తర్వాత నాటి హోంమంత్రి సహా ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ కూడా ఆ ప్రాంతంలో సందర్శించలేదన్నారు.

2017లో ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందనీ.. అయితేకిందటి అయిదేళ్ల కాలంలో జాతి హింస ఘటనలు లేకపోయినప్పటికీఏటా సగటున 212 రోజుల పాటు మణిపూర్ లో కార్యకలాపాలు స్తంభించిపోయాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారువెయ్యికి పైగా ఎన్‌కౌంటర్లు జరిగాయనివీటిపై సుప్రీంకోర్టు విచారణ జరపాలని అన్నారు2017 నుంచి ఆరేళ్ల బీజేపీ పాలనలో.. హైకోర్టు ఉత్తర్వుకు ముందు మణిపూర్‌లో ఒక్క రోజు కూడా బంద్ గానీ దిగ్బంధనం గానీ లేవనిఎలాంటి హింస జరగలేదని శ్రీ అమిత్ షా తెలిపారుహైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా ఉన్నదని రెండువర్గాలూ భావించడంతోనిర్దిష్ట పరిస్థితుల వల్ల కేవలం రెండు రోజుల్లోనే హింస చెలరేగిందన్నారు.

మణిపూర్‌లో హింసను ప్రభుత్వం విస్మరిస్తోందని కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయని శ్రీ అమిత్ షా అన్నారుహైకోర్టు ఉత్తర్వు జారీ అయిన రోజే వైమానిక దళ విమానాల ద్వారా ఆ ప్రాంతానికి భద్రతా దళాలను పంపించామని ఆయన సభకు తెలిపారుఈ అల్లర్లు అందరికీ ఆందోళన కలిగించే విషయమే అన్నారుమణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందనిఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని సభ్యులకు హోంమంత్రి విజ్ఞప్తి చేశారుఈ హింసలో కోల్పోయిన ప్రతి ప్రాణం పట్ల సభ హృదయపూర్వకంగా సానుభూతినీసంతాపాన్ని తెలపాలని కోరారు.

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత.. రెండు వర్గాలతో చర్చలుఇరు వర్గాలకు చెందిన అన్ని సంస్థలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించినట్లు శ్రీ అమిత్ షా తెలిపారుహోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్వరలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారుహింసను అంతం చేసే మార్గాన్ని ప్రభుత్వం అన్వేషిస్తోందనిశాంతిని నెలకొల్పడానికే తమ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారుగత నాలుగు నెలలుగా మణిపూర్‌లో ఎవరూ మృతిచెందలేదనిఇద్దరు మాత్రమే గాయపడ్డారనిపరిస్థితి చాలావరకు అదుపులో ఉందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారుఅయితేనిర్వాసితులైన ప్రజలు శిబిరాల్లో ఉండాల్సిన అవసరం లేనప్పుడే పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నట్టు భావిస్తామన్నారునిర్వాసితులకు పునరావాస ప్యాకేజీకి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

తమ ముఖ్యమంత్రి రాజీనామా చేశారనీ.. అనంతరం 37 మంది బీజేపీఆరుగురు ఎన్సీపీఅయిదుగురు ఎన్‌పీఎఫ్ఒక జేడీ (యూ), అయిదుగురు కాంగ్రెస్ సభ్యులతో గవర్నర్ చర్చలు జరిపారనీ కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారుప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో తాము లేమని చాలా మంది సభ్యులు చెప్పడంతో రాష్ట్రపతి పాలన విధించాలని క్యాబినెట్ సిఫార్సు చేసిందనిదానిని రాష్ట్రపతి ఆమోదించారని ఆయన తెలిపారుమణిపూర్‌లో వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించడానికిబాధితులకు పునరావాసం కల్పించడానికిక్షతగాత్రులు కోలుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ అమిత్ షా చెప్పారు.  


(Release ID: 2118638)