ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

షాట్ పుట్ లో రజత పతక విజేత సచిన్ ఖిలారికి ప్రధాని అభినందనలు

Posted On: 04 SEP 2024 3:30PM by PIB Hyderabad

పారిస్ పారాలింపిక్స్-2024లో పురుషుల షాట్ పుట్ ఎఫ్ 46 విభాగంలో రజతం సాధించిన సచిన్ ఖిలారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.

ప్రధానమంత్రి ‘ఎక్స్’లో చేసిన పోస్టు:

‘‘పారాలింపిక్స్ లో అద్భుతమైన విజయం సాధించిన సచిన్ ఖిలారికి అభినందనలు! సామర్థ్యం, సంకల్పం ప్రదర్శించి పురుషుల షాట్ పుట్ ఎఫ్ 46 విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఆయన్ని చూసి భారత్ గర్విస్తోంది. #Cheer4Bharat’’

 

 

***

MJPS/ST



(Release ID: 2051865) Visitor Counter : 34