ప్రధాన మంత్రి కార్యాలయం

పారిస్ పారాలింపిక్స్ 2024: ప్రీతి పాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

Posted On: 02 SEP 2024 12:01AM by PIB Hyderabad

ట్రాక్   అండ్ పీల్డ్ ఈవెంట్స్ లో క్రీడాకారిణి ప్రీతి పాల్ ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న   పారాలింపిక్స్ లో రెండో పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజున అభినందనలు తెలిపారు.

ఇరవై మూడేళ్ళ వయసున్న ప్రీతి పాల్ మహిళల 200 మీటర్ల టి35 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచారు.  ఆమె పారాలింపిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారులలో రెండు పతకాలను గెలిచిన ప్రథమ భారతీయ క్రీడాకారిణిగా నిలిచారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు :  

‘‘ప్రీతి పాల్ చరిత్రాత్మకమైన కార్యాన్ని సాధించారు.  పారాలింపిక్స్ (#Paralympics2024) లో ఆమెకు ఇది రెండో పతకం. ఆమె మహిళల 200 మీటర్ల టి35 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచారు. ఆమె భారతదేశ ప్రజలకు ఒక ప్రేరణగా నిలిచారు.  ఆమె అంకితభావం నిజంగా ప్రశంసనీయమైంది అని చెప్పాలి.

చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)’’



(Release ID: 2050880) Visitor Counter : 31