ప్రధాన మంత్రి కార్యాలయం

ఇరాన్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ మసూద్ పెజెశ్కియాన్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 06 JUL 2024 3:16PM by PIB Hyderabad

ఇస్లామిక్ గణతంత్రం ఇరాన్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ మసూద్ పెజెశ్కియాన్ కు అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ లో -

‘‘శ్రీ @drpezeshkian , మీరు ఇస్లామిక్ గణతంత్రం ఇరాన్ కు అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మీకు ఇవే అభినందనలు. మన దేశాల ప్రజల ప్రయోజనాల కోసం, ఈ ప్రాంతం ప్రయోజనాల కోసం మన స్నేహపూర్ణ సంబంధాలు, మన దీర్ఘకాలిక ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలపరచడం కోసం మీతో కలసి పనిచేయాలన్న ఆశ నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST



(Release ID: 2031326) Visitor Counter : 1089