ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో స్వర్ణం సాధించిన నితీష్‌కుమార్‌.. తరుణ్‌ థిల్లాన్‌లకు ప్రధాని అభినందన

Posted On: 27 OCT 2023 7:39PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌ ఎస్‌ఎల్‌-3, 4లో స్వర్ణ పతకం సాధించిన నితీష్ కుమార్, తరుణ్ థిల్లాన్‌ జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ తుదిపోరులో వారి సమష్టి కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్తరం క్రీడాకారులకు ఇదొక విశిష్ట ఉదాహరణగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్‌ఎల్‌3, 4’ విభాగంలో ప్రతిష్టాత్మక స్వర్ణం సాధించిన నితీష్ కుమార్, తరుణ్ థిల్లాన్‌లకు నా అభినందనలు. వారి సమష్టి కృషి, ప్రతిభ భవిష్యత్తరం క్రీడాకారులకు ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తాయి. యావద్భారతం ఈ జంట ప్రతిభ పట్ల గర్విస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1972421) Visitor Counter : 137