ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ ‘మిక్స్‌డ్‌ 50మీ. రైఫిల్‌-ఎస్‌హెచ్‌1’లో రజతం గెలిచిన రుద్రాంశ్‌ ఖండేల్వాల్‌కు ప్రధాని అభినందన

Posted On: 23 OCT 2023 5:43PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022 ‘మిక్స్‌డ్‌ 50మీటర్ల  రైఫిల్‌-ఎస్‌హెచ్‌1’లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు రుద్రాంశ్‌ ఖండేల్వాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారాగేమ్స్‌ ‘మిక్స్‌డ్‌ 50మీటర్ల రైఫిల్‌-ఎస్‌హెచ్‌1’లో అసమాన ప్రతిభతో రజతం సాధించిన రుద్రాంశ్‌ ఖండేల్వాల్‌కు నా హృదయపూర్వక ప్రశంసలు. ఈ సందర్భంగా అతడు చూపిన అంకిత భావం, నైపుణ్యం ఎంతో అభినందనీయం. ఈ విజయం ద్వారా ఔత్సాహిక క్రీడాకారులకు అతడొక ప్రమాణాన్ని నిర్దేశించాడు. అతడు సాధించిన ఘనత దేశాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1970874) Visitor Counter : 46