ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ ‘మిక్స్డ్ 50మీ. రైఫిల్-ఎస్హెచ్1’లో రజతం గెలిచిన రుద్రాంశ్ ఖండేల్వాల్కు ప్రధాని అభినందన
Posted On:
23 OCT 2023 5:43PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022 ‘మిక్స్డ్ 50మీటర్ల రైఫిల్-ఎస్హెచ్1’లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు రుద్రాంశ్ ఖండేల్వాల్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారాగేమ్స్ ‘మిక్స్డ్ 50మీటర్ల రైఫిల్-ఎస్హెచ్1’లో అసమాన ప్రతిభతో రజతం సాధించిన రుద్రాంశ్ ఖండేల్వాల్కు నా హృదయపూర్వక ప్రశంసలు. ఈ సందర్భంగా అతడు చూపిన అంకిత భావం, నైపుణ్యం ఎంతో అభినందనీయం. ఈ విజయం ద్వారా ఔత్సాహిక క్రీడాకారులకు అతడొక ప్రమాణాన్ని నిర్దేశించాడు. అతడు సాధించిన ఘనత దేశాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1970874)
Visitor Counter : 46
Read this release in:
Kannada
,
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil