ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో పారా కనూయింగ్ మహిళల విఎల్2 ఫైనల్ లో వెండి పతకాన్ని  ప్రాచీ యాదవ్ గారు గెలిచినందుకు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2023 11:22AM by PIB Hyderabad

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పారా కనూయింగ్ మహిళల విఎల్2 ఫైనల్ లో వెండి పతకాన్ని ప్రాచీ యాదవ్ గారు గెలిచినందుకు గాను ఆమె ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘ఏశియాన్ పారా గేమ్స్ లో తొలి పతకాన్ని సాధించి ప్రాచీ యాదవ్ గారు భారతదేశం యొక్క క్రీడల చరిత్ర లో తన పేరు ను వ్రాసుకొన్నారు.

పారా కనూయింగ్ మహిళల విఎల్2 ఫైనల్ లో అసాధారణమైన రజత పతక విజయాన్ని సాధించినందుకు గాను ప్రాచీ యాదవ్ గారి కి ఇవే అభినందన లు.

ఆమె యొక్క శ్రేష్ఠమైన ఆటతీరు యావత్తు దేశ ప్రజలు గర్వ పడేటట్లుగా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(రిలీజ్ ఐడి: 1970003) సందర్శకుల సూచీ సంఖ్య : : 186