ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ సంక్షోభ సమయాన వేగుచుక్కలా ప్రకాశిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ: ప్రధానమంత్రి

Posted On: 19 AUG 2023 6:42PM by PIB Hyderabad

   భారతదేశంపై ప్రపంచం ఆశావహ భావనకుగల కారణాలను వివరించే కథనాలు, సమాచార చిత్రాలను మనీ కంట్రోల్ వెబ్‌సైట్ సేకరించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని, స్థితిస్థాపక స్ఫూర్తిని ఈ కథనాలు, సమాచార చిత్రాలు చాటి చెబుతున్నాయని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ వేగుచుక్కగా ప్రకాశిస్తోంది. ఈ మేరకు దృఢమైన వృద్ధి, స్థితిస్థాపక స్ఫూర్తితో దేశ భవిష్యత్తు ఆశావహంగా కనిపిస్తోంది. ఇదే వేగాన్ని కొనసాగిస్తూ 140 కోట్ల మంది భారతీయులకు సౌభాగ్యాన్ని అందిద్దాం!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1950675) Visitor Counter : 155