ప్రధాన మంత్రి కార్యాలయం

హసన్‌ ఆలం హోల్డింగ్‌ కంపెనీ సీఈవోతో ప్రధాని సమావేశం

Posted On: 25 JUN 2023 5:22AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2023 జూన్ 24న కైరో నగరానికి చెందిన అతిపెద్ద ఈజిప్టు సంస్థ హసన్‌ ఆలం హోల్డింగ్‌ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి హసన్‌ ఆలంతో సమావేశమయ్యారు. ఈ సంస్థ ప్రధానంగా మధ్యప్రాచ్యంతోపాటు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూంటుంది.

   ఈ సమావేశం సందర్భంగా పునరుత్పాదక ఇంధనం, హరిత ఉదజని, మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాలకు సంబంధించి భారత కంపెనీల మధ్య సన్నిహిత సహకారంపై వారు చర్చించారు.

*****



(Release ID: 1935270) Visitor Counter : 110