ప్రధాన మంత్రి కార్యాలయం

20వ ఆసియా అండర్‌-20 క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రతిభకు ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 09 JUN 2023 8:05PM by PIB Hyderabad

   భారత క్రీడాకారులు 20వ ఆసియా అండర్‌-20 క్రీడల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“మన క్రీడాకారులను చూసి నేనెంతో గర్విస్తున్నాను… 20వ ఆసియా అండర్‌-20 క్రీడల్లో వారు అద్భుతంగా రాణించారు! ప్రపంచంలోని 45 దేశాలు పాల్గొన్న ఈ క్రీడల్లో 6 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలతో 3వ స్థానంలో నిలిచి సత్తా చాటారు. వారి విజయంపై మనమంతా వేడుక చేసుకుందాం. అలాగే భవిష్యత్తులోనూ వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1931368) Visitor Counter : 144