ప్రధాన మంత్రి కార్యాలయం

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 మహిళల కుస్తీ 57 కిలోల విభాగంలో రజత పతక విజేత అన్షు మాలిక్‌కు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 05 AUG 2022 11:02PM by PIB Hyderabad

   కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 మహిళల కుస్తీ 57 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన అన్షు మాలిక్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంపిన సందేశంలో;

   “కుస్తీ పోటీలో... ముఖ్యంగా తన జన్మదినం నాడు రజత పతకం సాధించిన అన్షు మాలిక్‌కు శుభాభినందనలు. భవిష్యత్‌ క్రీడా పయనంలోనూ మరిన్ని విజయాలు సాధించగలదని ఆశిస్తూ ఆమెకు నా శుభాశీస్సులు. క్రీడలపై ఆమెకుగల అమితాసక్తి వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం కాగలదు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



***


DS/TS/AK
 


(Release ID: 1849090) Visitor Counter : 88