ప్రధాన మంత్రి కార్యాలయం

ఈశాన్య ప్రాంతం సర్వతోముఖ అభివృద్ధి కోసం చేపట్టిన పరివర్తనాత్మకమైనకార్యక్రమాలు - ‘పూర్వోత్తర్ సంక్షేమం లో 8 సంవత్సరాలు’ ను శేర్ చేసిన ప్రధాన మంత్రి 

Posted On: 13 JUN 2022 11:10AM by PIB Hyderabad

గడచిన 8 సంవత్సరాల లో ఈశాన్య ప్రాంతం సర్వోతోముఖ అభివృద్ధి కి గాను చేపట్టినటువంటి పరివర్తనాత్మకమైన కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన వెబ్ సైట్ నుంచి, నమో ఏప్ (Namo App ) నుంచి మరియు మైగవ్ (MyGov) నుంచి వ్యాసాల ను మరియు ట్వీట్ ల మాలిక ను శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘గత 8 సంవత్సరాల కాలం లో ఈశాన్య ప్రాంతం లో మునుపు ఎరుగనటువంటి అభివృద్ధి చోటు చేసుకొంది. మౌలిక సదుపాయాల ను కల్పించడం పైన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు ఆ ప్రాంతం లోని వివిధ రాష్ట్రాల ఘనమైన సంస్కృతుల కు లోకప్రియత్వం లభించేటట్టు చూడడం వంటి అంశాల పైన శ్రద్ధ వహించడమైంది. #8YearsOfPurvottarKalyan”

‘‘ఈశాన్య ప్రాంతం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం ఉద్దేశించినటువంటి పరివర్తనాత్మకమైన కార్యక్రమాలు. ‘‘#8YearsOfPurvottarKalyan” అని పేర్కొన్నారు.

 

DS

 



(Release ID: 1833506) Visitor Counter : 142