ప్రధాన మంత్రి కార్యాలయం
యుపిఐ మరియు డిజిటల్ చెల్లింపుల నుగురించి డేటా సోనిఫికేశన్ ద్వారా తెలియజేస్తున్న ఐఐపి ని ప్రశంసించిన ప్రధానమంత్రి
Posted On:
13 APR 2022 2:01PM by PIB Hyderabad
సమాచార సూచక శబ్ద తరంగాల ను ఉత్పత్తి చేసే ప్రక్రియ (డేటా సోనిఫికేశన్) ద్వారా యుపిఐ మరియు డిజిటల్ చెల్లింపుల ను గురించి తెలియజేస్తున్నందుకు ఇండియా ఇన్ పిక్సెల్స్ (ఐఐపి) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ట్విటర్ మాధ్యమం లో ఇండియా ఇన్ పిక్సెల్స్ పొందుపరచిన ఒక సందేశాని కి ప్రధాన మంత్రి ప్రతిస్పందించారు.
‘‘యుపిఐ ఇంకా డిజిటల్ మాద్యమాల ద్వారా చెల్లింపు లు జరపడాన్ని గురించి చాలా తరచు గా నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ విధమైనటువంటి చెల్లింపు లను గురించి ప్రభావవంతమైన రీతి లో తెలియజేయడం కోసం- జరిగిన లావాదేవీ తాలూకు సమాచారాన్ని వినియోగించుకొంటూ మీరు ఎలాగ శబ్ద తరంగాల ను ఉత్పత్తి చేస్తున్నదీ (డేటా సోనిఫికేశన్) ఆ వైనాన్ని గురించి విని నేను నిజం గానే సంతోషించాను.
ఇది చాలా ఆసక్తిదాయకం గాను, ప్రభావితం చేసేది గాను మరియు స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇచ్చేది గాను ఉంది.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
(Release ID: 1817165)
Visitor Counter : 162
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam