ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహావీర్ జయంతి నాడు ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 14 APR 2022 9:37AM by PIB Hyderabad

మహావీర్ జయంతి నాడు దేశ ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. భగవాన్ మహావీరుని పవిత్రమైనటువంటి ప్రబోధాల ను, మరీ ముఖ్యం గా శాంతి, కరుణ మరియు సోదర భావాల పట్ల ఆయన చూపించిన శ్రద్ధ ను శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శుభకరమైన మహావీర్ జయంతి సందర్భం లో అందరి కి ఇవే శుభాకాంక్ష లు.

భగవాన్ మహావీరుని చిర స్థాయి లో నిలచేటటువంటి బోధన లు మరియు జీవ దయ కు ఆయన కట్టబెట్టిన ప్రాధాన్యం ఒక సమాన అవకాశాలు కలిగినటువంటి మరియు కరుణ నిండినటువంటి సమాజం నిర్మాణానికి సాయపడగలుగుతాయి.

భగవాన్ మహావీరుని ఆశీస్సు లు మన సమాజం లో శాంతి, ఇంకా సోదర భావనల ను పెంపొందింపచేయుగాక.’’ అని పేర్కొన్నారు.


*****
DS/ST


 

 

 


(रिलीज़ आईडी: 1816867) आगंतुक पटल : 265
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam