ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం... చైతన్యాలను ప్రతిబింబించే విశిష్ట వేడుక మాధవపూర్ మేళా: ప్రధానమంత్రి

Posted On: 10 APR 2022 1:14PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమ ప్రసంగంలో- మాధవ్‌పూర్‌ మేళాను భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, చైతన్యాలను ప్రతిబింబించే ఒక విశిష్ట వేడుకగా అభివర్ణించిన విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో-

   “మాధవ్‌పూర్ మేళా ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, చైతన్యాలను ప్రతిబింబించే ఈ అపూర్వ వేడుక గురించి గత నెల #మన్‌కీబాత్‌లోని నా వ్యాఖ్యను మీతో పంచుకుంటున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

   అలాగే మేళా ఇతివృత్తాన్ని, హర్షదాయక స్ఫూర్తిని ప్రస్ఫుటం చేస్తూ గుజరాత్ పర్యాటక శాఖ ట్విట్టర్‌ ద్వారా ఇచ్చిన సందేశాన్ని కూడా ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు.



(Release ID: 1815596) Visitor Counter : 142