ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2023 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశానికి ఆతిథ్యమివ్వడానికి భారతదేశం ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేసిన - ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2022 6:02PM by PIB Hyderabad

2023 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశానికి ఆతిథ్యమిచ్చే దేశంగా భారతదేశాన్ని ఎంపిక చేయడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ, 

“2023 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ  సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఎంపిక కావడం ఆనందంగా ఉంది.  ఇది ఒక చిరస్మరణీయమైన ఐ.ఓ.సి. సమావేశమౌతుందనీ, ప్రపంచ క్రీడలకు సానుకూల ఫలితాలకు దారి తీస్తుందనీ, నేను విశ్వసిస్తున్నాను: ప్రధానమంత్రి @narendramodi #StrongerTogether" అని పేర్కొంది. 

 

*****


(రిలీజ్ ఐడి: 1799706) సందర్శకుల సూచీ సంఖ్య : : 202