ప్రధాన మంత్రి కార్యాలయం
సామాజిక కార్యకర్త మరియు పద్మ పురస్కార గ్రహీత శాంతి దేవి జీ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
17 JAN 2022 5:59PM by PIB Hyderabad
ప్రఖ్యాత సామాజిక కార్యకర్త మరియు పద్మ పురస్కార గ్రహీత అయిన శ్రీమతి శాంతి దేవి జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘శాంతి దేవి జీ ని పేదల వాణి గాను, ఆదరణ కు నోచుకోని వర్గాల వారి వాణి గాను స్మరించుకోవడం జరుగుతుంది. కష్టాల ను దూరం చేయడం కోసం మరియు ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని, అలాగే న్యాయపూర్ణమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దడం కోసం ఆవిడ నిస్వార్థ భావం తో పాటుపడ్డారు. ఆమె మరణించారని తెలిసి దు:ఖం కలిగింది. ఆమె కుటుంబానికి మరియు అసంఖ్యాకంగా ఉన్నటువంటి ఆమె ప్రశంసకుల కు కలిగిన దు:ఖం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
*****
DS/AK
(Release ID: 1790740)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam