ప్రధాన మంత్రి కార్యాలయం

ఆగష్టు 11న సిఐఐ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

Posted On: 09 AUG 2021 10:07PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఆగస్టు 11న సాయంత్రం 4 గంటల 30 నిముషాలకు భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) వార్షిక సమావేశం- 2021 ని ఉద్దేశించి  వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.  ‘ఇండియా@75: గవర్నమెంట్ ఎండ్ బిజినెస్ వర్కింగ్ టుగెదర్ ఫార్ ఆత్మనిర్భర్ భారత్’ అనేది ఈ సమావేశానికి ఇతివృత్తం గా ఉంది.


సిఐఐ వార్షిక సమావేశం-2021 ని గురించి:

సిఐఐ వార్షిక సమావేశాన్ని రెండు రోజుల పాటు, అంటే ఆగస్టు 11వ, 12వ తేదీల లో, నిర్వహించడం జరుగుతుంది.  ఈ సమావేశం లో ప్రత్యేక అంతర్జాతీయ అతిథి వక్త గా సింగపూర్ ఉప ప్రధాని, ఆర్థిక విధానాల సమన్వయ శాఖ మంత్రి, శ్రీ హెంగ్ స్వీ కీత్ ప్రసంగించనున్నారు.  ఈ కార్యక్రమం లో అనేక మంది మంత్రులు, సీనియర్ అధికారులు, విద్యావేత్తల తో పాటు భారతీయ పరిశ్రమ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులు కూడా పాల్గొంటారు.




 

***



(Release ID: 1744287) Visitor Counter : 187