ప్రధాన మంత్రి కార్యాలయం

కాకతీయ రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశం గా యునెస్కో ప్రకటించిన సందర్భం లో సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 25 JUL 2021 6:24PM by PIB Hyderabad

కాకతీయ రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశం గా యునెస్కో ప్రకటించిన సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  భవ్యమైనటువంటి ఆ దేవాలయ సముదాయాన్ని సందర్శించి, ఆ దేవాలయం గొప్పదనాన్ని గురించి మౌలికం గా అనుభవాన్ని పొందవలసింది గా ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు కూడా. 

యునెస్కో చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ ఇలా అన్నారు:

‘‘దివ్యం గా ఉంది! ప్రతి ఒక్కరి కి, ప్రత్యేకించి తెలంగాణ ప్రజల కు, ఇవే అభినందన లు.

ప్రతిమాత్మకమైనటువంటి రామప్ప దేవాలయం మహా కాకతీయ రాజ వంశం యొక్క విశిష్ట శిల్పకళ వైభవాన్ని కళ్లకు కడుతున్నది.  ఆ ఠీవి గల దేవాలయ సముదాయాన్ని మీరంతా సందర్శించాలని, ఆ ఆలయ మహత్వాన్ని గురించి మౌలిక అనుభవాన్ని పొందవలసిందని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ’’ 

***

 

 

***

 



(Release ID: 1738872) Visitor Counter : 274