ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ మనోజ్ దాస్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 28 APR 2021 9:11AM by PIB Hyderabad

ప్రసిద్ధ విద్యావేత్త, జనాదరణ పాత్రుడైన ప్రత్యేక శీర్షికా రచయిత, ఉత్కృష్ట రచయిత అయిన శ్రీ మనోజ్ దాస్ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘శ్రీ మనోజ్ దాస్ ఒక ప్రసిద్ధ విద్యావేత్త గా, జనాదరణ పాత్రుడైన కాలమిస్టుగా, ఉత్కృష్ట రచయిత గా కూడా పేరు తెచ్చుకొన్నారు.  ఒడియా సాహిత్యానికి, ఇంగ్లిషు సాహిత్యానికి ఆయన ఉత్తమమైన తోడ్పాటు ను అందించారు.  శ్రీ అరవిందుల వారి ఆలోచనల ను వ్యాప్తి చేయడం లో ప్రముఖ పాత్ర ను పోషించారు.  శ్రీ మనోజ్ దాస్ మరణించారని తెలిసి నాకు దు:ఖం కలిగింది.  ఆయన కుటుంబానికి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

 


(रिलीज़ आईडी: 1714661) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam