ప్రధాన మంత్రి కార్యాలయం

ఆచార్య మహామండలేశ్వర్ పూజ్య స్వామి అవధేశానంద్ గిరి జి తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి


రెండు సార్లు శాహీ స్నానం చేసిన అనంతరం కుంభ్ ను ఇక ప్రతీకాత్మకం గా ఉండనివ్వండి అంటూ అభ్యర్థించారు


సాధువుల ఆరోగ్యాన్ని గురించి వాకబు చేశారు

प्रविष्टि तिथि: 17 APR 2021 9:25AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆచార్య మహామండలేశ్వర్ పూజ్య స్వామి అవధేశానంద్ గిరి గారి తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.  సాధువులందరి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకొన్నారు.  పాలన యంత్రాంగానికి అన్ని విధాలు గాను సహకరిస్తున్నందుకు సాధువుల సముదాయం పట్ల ఆయన కృత‌జ్ఞ‌త‌ ను వ్యక్తం చేశారు.  

ఇప్పటికే రెండు శాహీ స్నానాలు సంపన్నం అయ్యాయి కాబట్టి భావి కుంభ్ ను ఇక ప్రతీకాత్మకం గా ఉండనివ్వండి అంటూ ప్రధాన మంత్రి అభ్యర్థించారు.  ఇలా చేస్తే. మహమ్మారి కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధం బలవత్తరం అవుతుంది అని కూడా ఆయన అన్నారు.

***


(रिलीज़ आईडी: 1712426) आगंतुक पटल : 245
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada