ప్రధాన మంత్రి కార్యాలయం

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోనున్న శ్రీ రజినీకాంత్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 APR 2021 11:17AM by PIB Hyderabad

శ్రీ రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్న నేపథ్యం లో ఆయన ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

 ‘‘అనేక తరాల ఆదరణ కు పాత్రుడు అయినటువంటి, చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమయ్యే కృషి చేసినటువంటి, వైవిధ్యభరితమైన పాత్రల ను పోషించిన, మోహితులను చేసే వ్యక్తిత్వం కలిగిన.. అటువంటి వ్యక్తే శ్రీ @rajinikanth గారు.

తలైవా కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రదానం చేస్తారన్న సమాచారం అంతులేని ఆనందాన్ని అందించే విషయం. ఆయన కు ఇవే అభినందన లు.’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***



(Release ID: 1708888) Visitor Counter : 216