ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
19 రోజుల్లో దాదాపు 45 లక్షలమందికి కోవిడ్ టీకాలు
18 రోజుల్లో 40 లక్షల టీకాలిచ్చిన వేగవంతమైన దేశం భారత్
చికిత్సలో కోవిడ్ బాధితులు స్థిరంగా తగ్గుతూ 1.55 లక్షల దిగువకు
Posted On:
04 FEB 2021 11:27AM by PIB Hyderabad
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి మీద పోరులో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించింది. ఇప్పటివరకు దాదాపు 45 లక్షలమంది (44,49,552) కోవిడ్ టీకాలు అందుకున్నారు. ఈ సంఖ్య చేరుకోవటానికి కేవలం 19 రోజుకు పట్టింది. 18 రోజుల్లో 40 లక్షలమందికి టీకాలివ్వటం ద్వారా భారతదేశం అత్యంత వేగంగా ఈ లక్ష్యం చేరుకున్న దేశంగా నిలిచింది. చాలా దేశాలకు ఇలాంటి ఆరంభాన్ని అందుకోవటానికి 65 రోజులు పట్టింది. భారతదేశం 2021 జనవరి 16న దేశవ్యాప్త కోవిడ్ టీకాల కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ప్రతి రోజూ టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య పురోగతి కనబరుస్తూనే ఉంది.
గత 24 గంటలలో 3,10,604 మంది 8,041 శిబిరాలలో టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు 84,617 శిబిరాలు నిర్వహించారు.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
టీకాల లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
2,772
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
2,15,171
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
9,846
|
4
|
ఆస్సాం
|
43,607
|
5
|
బీహార్
|
2,64,097
|
6
|
చండీగఢ్
|
4,399
|
7
|
చత్తీస్ గఢ్
|
1,01,564
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
926
|
9
|
డామన్, డయ్యూ
|
561
|
10
|
ఢిల్లీ
|
81,433
|
11
|
గోవా
|
6,326
|
12
|
గుజరాత్
|
3,11,251
|
13
|
హర్యానా
|
1,29,866
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
43,926
|
15
|
జమ్మూ కశ్మీర్
|
26,634
|
16
|
జార్ఖండ్
|
67,970
|
17
|
కర్నాటక
|
3,16,638
|
18
|
కేరళ
|
2,46,043
|
19
|
లద్దాఖ్
|
1,511
|
20
|
లక్షదీవులు
|
807
|
21
|
మధ్యప్రదేశ్
|
3,30,722
|
22
|
మహారాష్ట్ర
|
3,54,633
|
23
|
మణిపూర్
|
5,872
|
24
|
మేఘాలయ
|
4,806
|
25
|
మిజోరం
|
9,995
|
26
|
నాగాలాండ్
|
4,244
|
27
|
ఒడిశా
|
2,11,346
|
28
|
పుదుచ్చేరి
|
3,222
|
29
|
పంజాబ్
|
63,663
|
30
|
రాజస్థాన్
|
3,63,521
|
31
|
సిక్కిం
|
3,425
|
32
|
తమిళనాడు
|
1,33,434
|
33
|
తెలంగాణ
|
1,76,732
|
34
|
త్రిపుర
|
32,340
|
35
|
ఉత్తరప్రదేశ్
|
4,63,793
|
36
|
ఉత్తరాఖండ్
|
54,153
|
37
|
పశ్చిమ బెంగాల్
|
3,01,091
|
38
|
ఇతరములు
|
57,212
|
మొత్తం
|
44,49,552
|
ఇప్పటివరకు టీకాలు వేయించుకున్నవారిలో 54.87% మంది కేవలం 7 రాష్ట్రాలకు చెందినవారే.
భారత్ లో చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతూ నేటికి 1,55,025 కు చేరింది. దేశమంతటా ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ లలో వీరు కేవలం 1.44%. ప్రతి రోజూ అంతకుముందు రోజుకంటే కోవిడ్ చికిత్స పొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ రావటం స్పష్టంగా కనబడుతోంది.
భారతదేశపు రోజువారీ పాజిటివ్ శాతం నేటికి 1.82% అయింది. గడిచిన 19 రోజులుగా పాజిటివ్ శాతం 2% లోపే ఉంటూ వస్తోంది.
ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,04,80,455 కాగా, కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కోలుకున్నవారి శాతం 97.13% కి చేరింది. చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 67.6 రెట్లు ఎక్కువ. గత 24 గంటలలో కోలుకున్నవారిలో 86.04% మంది కేవలం 6 రాష్ట్రాల్లోనే నమొదయ్యారు. గత 24 గంటలలో మహారాష్ట్రలో అత్యధికంగా 7,030 మంది, కేరళలో 6,380 మంది, తమిళనాడులో మంది కోలుకున్నారు.
కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 84.67% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా 6,356 కేసులు, మహారాష్ట్రలో 2,992, తమిళనాడులో 514 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటలలో నమోదైన మరణాలలో 71.03% ఆరు రాష్టాలలోనే సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 30 మంది మరణించగా కేరళలో 20 మంది, చత్తీస్ గఢ్ లో ఏడుగురు చనిపోయారు..
***
(Release ID: 1695111)
Visitor Counter : 195
Read this release in:
Urdu
,
Marathi
,
Punjabi
,
Tamil
,
Malayalam
,
Assamese
,
Odia
,
English
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Gujarati