ప్రధాన మంత్రి కార్యాలయం

జెన్ నోవా బయోఫార్మా, బయలాజికల్ ఇ, డాక్టర్ రెడ్డీస్ బృందాలతో మాట్లాడనున్న ప్రధాన మంత్రి

Posted On: 29 NOV 2020 6:19PM by PIB Hyderabad

కోవిడ్-19 కి టీకామందును కనుగొనడంలో తలమునకలుగా ఉన్న జెన్ నోవా బయోఫార్మా, బయలాజికల్ ఇ, డాక్టర్ రెడ్డీస్ బృందాలతో  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపటి రోజు న అంటే ఈ నెల 30వ తేదీ సోమవారం నాడు సంభాషించనున్నారు.
 
 ‘‘కోవిడ్-19 కి టీకామందును కనుగొనడం లో నిమగ్నం అయిన మూడు బృందాలతో రేపటి రోజున, అంటే 2020వ సంవత్సరం నవంబర్ 30 న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా PM @narendramodi మాట్లాడుతారు.  ఆయన సంభాషించే ఈ బృందాలు జెన్ నోవా బయోఫార్మా, బయలాజికల్ ఇ, డాక్టర్ రెడ్డీస్ లకు చెందిన బృందాలు’’ అని భారతదేశ ప్రధాన మంత్రి కార్యాలయం  (@PMOIndia)  సామాజిక మాధ్యమం ట్విటర్ ద్వారా ఈ రోజు న, అంటే ఈ నెల 29వ తేదీ ఆదివారం నాడు తెలిపింది.   

***



(Release ID: 1677026) Visitor Counter : 141