నౌకారవాణా మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వల్ల పోర్ట్ ఉద్యోగులు/కార్మికులు చనిపోతే రూ.50 లక్షల నష్టపరిహారం
నేరుగా పోర్టు నియమించిన కాంట్రాక్టు కార్మికులు, ఇతర కాంట్రాక్టు ఉద్యోగులుతో పాటు పోర్ట్ ఉద్యోగులంతా ఈ పరిథిలోకి వస్తారు
Posted On:
28 APR 2020 3:04PM by PIB Hyderabad
కోవిడ్-19 వల్ల మరణించిన అన్ని ప్రధాన ఓడరేవుల ఉద్యోగులకు నష్టపరిహారం/ ఎక్స్-గ్రేషియా చెల్లించాలని షిప్ప్పింగ్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. చనిపోయిన వారిపై ఆధారపడ్డ వారు/ చట్ట బద్ధమైన సంబంధీకులకు ఈ చెల్లింపు క్రింది విధంగా ఉంటుంది:
క్యాటగిరి
|
నష్టపరిహారం/ ఎక్స్-గ్రేషియా (రూ.ల్లో)
|
పోర్టు ఉద్యోగులంతా, పోర్టు నేరుగా నియమించిన కాంట్రాక్టు కార్మికులతో సహా
|
50.00 లక్షలు
|
ఇతర కాంట్రాక్టు కార్మికులు
|
50.00 లక్షలు
|
పోర్ట్ సంబంధిత విధులను నిర్వర్తించేటప్పుడు కోవిడ్ -19 ప్రభావం కారణంగా ప్రాణ నష్టం జరిగిన పక్షంలో వర్తించేలా ఈ ద్రవ్య పరిహారం ప్రకటించబడింది. మరణానికి కారణం కోవిడ్-19 వల్ల అని నిర్ధారణ చేసుకోవడం, అందుకు నష్టపరిహారం/ ఎక్స్-గ్రేషియా చెల్లింపునకు సంబంధించిన ధ్రువీకరణ అధికారం పోర్ట్ చైర్మన్ దే. ఈ పరిహారం కోవిడ్-19 మహమ్మారి వల్ల మరణం సంభవించినదానికి మాత్రమే వర్తిస్తుంది. 30.09.2020 వరకు అమలులో ఉంటుంది, ఆ తర్వాత సమీక్షకు లోబడి ఉంటుంది.
***
(Release ID: 1618935)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam