ప్రధాన మంత్రి కార్యాలయం

ఎన్నడూలేనంత పటిష్టంగా భారత్‌-బ్రెజిల్‌ భాగస్వామ్యం: ప్రధానమంత్రి

Posted On: 10 APR 2020 2:15PM by PIB Hyderabad

భారత్‌-బ్రెజిల్‌ దేశాల భాగస్వామ్యం ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. బ్రెజిల్‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సరఫరా చేయాలన్న భారత్‌ నిర్ణయంపై ఆ దేశాధ్యక్షుడు జైర్‌ ఎం.బొల్సొనారో ట్విట్టర్‌ద్వారా కృతజ్ఞతలు తెలిపిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ మేరకు స్పందించారు. “ప్రపంచ మహమ్మారిపై మానవాళి పోరాటానికి తనవంతు సాయం చేసేందుకు భారత్‌ కట్టుబడి ఉంది” అని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.



(Release ID: 1613025) Visitor Counter : 172