ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 4:23PM by PIB Hyderabad

భారత్‌ మాతా కీ జై!

భారత్‌ మాతా కీ జై!

భారత్‌ మాతా కీ జై!

   ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్కార్యశీలుడైన ప్రజాదరణగల యువ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామికేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీశ్రీ అజయ్ టమ్టాసాంకేతిక మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తాబీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ మహేంద్ర భట్ సహా వేదికను అలంకరించిన మాజీ గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీమాజీ ముఖ్యమంత్రులైన సోదరులు శ్రీ రమేష్ పోఖ్రియాల్శ్రీ విజయ్ బహుగుణశ్రీ తీరథ్‌ సింగ్ రావత్శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్ఉత్తరాఖండ్ ప్రభుత్వ మంత్రులుఎంపీలుఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీసోదరులందరికీ అభివందనం.

మిత్రులారా!

దేవభూమిగా పేరుపడిన ఉత్తరాఖండ్ అనే ఈ పవిత్ర గడ్డపైనుంచి మీ అందరికీ వందనాలు అర్పిస్తున్నానుఅలాగేఅత్యధిక సంఖ్యలో హాజరైన పూజ్య సాధువులకూ నమస్సులురాష్ట్రంలోని పెద్దలుతాతయ్యలునానమ్మలుప్రియ సోదరీసోదరులుఅక్కచెల్లెళ్లందరికీ కూడా సగౌరవ నమస్కారం!

ఈ రాష్ట్ర వాస్తవ్యులే కాకుండా ఢిల్లీఉత్తరప్రదేశ్‌ నుంచి కూడా ఎంతోమంది సాంకేతికత మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారువారందరికీ స్వాగతం పలికే ముందు.. ఇక్కడికి రావడంలో గంటకు పైగా ఆలస్యమైనందుకు క్షంతవ్యుణ్నినా వల్ల అన్నిచోట్లా మీరందరూ చాలాసేపు వేచి చూడాల్సి వచ్చిందిఅయితేనేను సకాలంలోనే బయల్దేరినాకాళీమాత ఆలయం నుంచి ఇక్కడి దాకా దాదాపు 12 కిలోమీటర్ల రోడ్‌షోలో ప్రజల ఉత్సాహోద్వేగాల ఫలితంగా కారు వేగంగా నడవడం సాధ్యం కాలేదుఅందుకేజనాన్ని పలకరిస్తూఆ ‘జనార్దనుడి’ ఆశీస్సులు అందుకునిఇక్కడికి చేరేసరికి గంటకు పైగా ఆలస్యం తప్పలేదుఅందుకే... మిమ్మల్ని క్షమాపణ కోరానుఈ 12 కిలోమీటర్ల మేర ఇంతటి వేసవి తీవ్రతను భరిస్తూ ఈ జనసంద్రం ఇక్కడ గుమికూడిందిఉత్తరాఖండ్‌  తల్లులుసోదరీసోదరుల ప్రేమఅశేష ఆశీస్సులు పొందడం ఇవాళ నాకో కొత్త శక్తినిస్ఫూర్తిని ఇచ్చాయిఇందుకుగాను ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

దేశవ్యాప్తంగా ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొందివివిధ ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలు సాగుతున్నాయిఈ నేపథ్యంలో బైశాఖిబొహాగ్‌బిహుపుత్తాండు వంటి పేర్లతో సంవత్సరాది ఉత్సవాలు చేసుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

ఇక కొద్ది రోజుల్లో యమునోత్రిగంగోత్రిబాబా కేదార్‌నాథ్బద్రీనాథ్ ధామ్ యాత్ర కూడా ప్రారంభం కానుందిదేశంలోని కోట్లాది భక్తులు ఈ పవిత్ర సందర్భం కోసం ఎంతో భక్తిశ్రద్ధలతో వేచి చూస్తున్నారుఈ నేపథ్యంలో నేనిక్కడి పంచ బద్రిపంచ కేదార్పంచ ప్రయాగ అధిష్ఠాన దేవతలకు గౌరవ పూర్వకంగా నమస్కరిస్తున్నానుఅలాగేసంతలా మాతకూ శిరసాభివందనం చేస్తున్నానుఇక్కడికి వచ్చేముందు ‘దాత్ కాళీమాత’ దర్శన భాగ్యం కలిగిందిడెహ్రాడూన్ నగరానికి ఆ మాత అపార అనుగ్రహం ఉందిఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ వంటి ఇంత భారీ ప్రాజెక్టు పూర్తి కావడంలో మాత ఆశీస్సులు ఎంతో బలాన్నిచ్చాయి.

మిత్రులారా!

ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తికాగాఈ 26వ వార్షికోత్సవం సందర్భంగా నేడు ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో ఈ రాష్ట్ర ప్రగతికి మరో గొప్ప విజయం తోడైందిబహుశా మీకు గుర్తుండే ఉంటుంది... బాబా కేదార్ దర్శనం తర్వాత ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఉత్తరాఖండ్‌కే చెందుతుందని అప్రయత్నంగా నా నోట మాట వెలువడిందిద్వంద్వ చోదక ప్రభుత్వ విధానాలురాష్ట్ర ప్రజల కృషి వల్ల ఈ యువ రాష్ట్రం ప్రగతికి కొత్త కోణాలను జోడిస్తుండటం నాకెంతో సంతోషంగా ఉందిఈ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందిఈ ఎక్స్‌ప్రెస్‌వేలో అధికభాగం ఉత్తరప్రదేశ్‌ గుండా వెళ్తుందిదీనివల్ల ఘజియాబాద్బాఘ్‌పత్బరౌత్షామ్లీసహారన్‌పూర్ వంటి చాలా నగరాలు ఎంతో ప్రయోజనం పొందుతాయిపర్యాటక రంగ ప్రగతి రీత్యా ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైనదిఈ ప్రాజెక్టు సాకారంపై యావద్దేశానికి నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా!

ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ జయంతి నేపథ్యంలో కోట్లాది దేశ ప్రజల తరపున ఆ మహనీయుడికి నా నివాళిగడచిన దశాబ్దంలో మా ప్రభుత్వం అమలు విధానాలుతీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ గౌరవాన్ని పునఃస్థాపించాయిఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత రాజ్యాంగం ఇవాళ దేశమంతటికీ వర్తిస్తుందిమావోయిజం-నక్సలిజం అంతమైన వందల జిల్లాల్లోనూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనులు సాగుతున్నాయిదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు కావాలన్నది మన రాజ్యాంగ ఆకాంక్షఈ క్రమంలో ఉత్తరాఖండ్ ఆ స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని ముందడుగు వేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది.

మిత్రులారా!

పేదలుఅణగారిన వర్గాలుపీడితులకు సమన్యాయం చేసే వ్యవస్థను అందించడానికి బాబాసాహెబ్ తన జీవితాన్ని అంకితం చేశారుఇప్పుడు మా ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో ప్రతి పేదకూఅణగారిన వ్యక్తికి వాస్తవిక సామాజిక న్యాయ ప్రదానంలో నిమగ్నమైందిఇక సామాజిక న్యాయానికి గొప్ప మాధ్యమం దేశ సమతుల ప్రగతిఅందరికీ సౌకర్యాలుశ్రేయస్సుఅందుకేబాబాసాహెబ్ ఆధునిక మౌలిక సదుపాయాలుపారిశ్రామికీకరణ ఆవశ్యకతను గట్టిగా సమర్థించారు.

మిత్రులారా!

ప్రజలు తరచూ తమ భవిష్యత్తు ఎలా ఉంటుందనే అంశంపై అరచేతిలోని గీతలను చూసి అంచనా వేస్తుంటారుఆ మేరకు భవిష్యవాణి చెప్పేవారు ఆ గీతలను చూసి ప్రతి వ్యక్తి భవిష్యత్తు గురించి చెబుతుంటారుఅయితేనాకు ఈ జ్యోతిష శాస్త్రం గురించి తెలియదుగానీఇదీ ఒక శాస్త్రమేనంటారుఇప్పుడిది ఒక వ్యక్తి చేతిలోని గీతలలో ఇమిడిన అతని విధిరాతను చెబుతుందిఅయితేనేను దాన్ని జాతి జీవనానికి అన్వయించి చూస్తున్నానుఒక దేశం విధి గురించి ఆ గీతలు ఏం చెబుతున్నాయిఒక దేశపు భాగ్యరేఖలంటే రోడ్లుజాతీయ రహదారులుఎక్స్‌ ప్రెస్‌వేలువిమాన మార్గాలురైల్వేలుజలమార్గాలు... ఇవే!  గత దశాబ్దం నుంచీ వికసిత భారత్‌ను రూపుదిద్దడం కోసం ఈ ప్రగతి భాగ్యరేఖల నిర్మాణంలో నిమగ్నమైందిఇవన్నీ కేవలం వర్తమానానికి పరిమితమైన సౌకర్యాలు కావు... భావితరాల శ్రేయస్సుకూ హామీ... మోదీ హామీకి నిదర్శనాలు.

ఈ మేరకు గత దశాబ్దంలో మా ప్రభుత్వం ఈ పురోగమనం కోసం అసాధారణ రీతిలో పెట్టుబడులు పెడుతూ వచ్చిందిశ్రీ నితిన్‌ గడ్కరీ ఇప్పుడే మీకు ఉత్తరాఖండ్‌ సంబంధిత అనేక గణాంకాలను వివరించారుఅయితేనేనొక అంకె చెబుతాను వినండి... ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం 2014 దాకా దేశం మొత్తం మీద ఒక ఏడాదిలో కనీసం రూ.2 లక్షల కోట్లు కూడా వెచ్చించలేదుఅయితేఇప్పుడొక వాస్తవం చెబుతున్నా... అదేమిటంటేమునుపటితో పోల్చినపుడు ఇప్పుడిది రెట్లకు పైగా.. రూ.12 లక్షల కోట్లకు పెరిగిందిఇందులో ఇక్కడే..  ఈ ఉత్తరాఖండ్‌లోనే రూ.2.5 కోట్లకుపైగా మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయిఇప్పుడు గమనించండి... 2014కు ముందు యావద్దేశానికీ రూ.2 లక్షల కోట్లు కాగానేడు ఒక్క ఉత్తరాఖండ్‌కే రూ.2.5 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాంఉత్తరాఖండ్ గ్రామాలలో ఒక చిన్న రోడ్డు కోసం ప్రజలు ఒకప్పుడు తరతరాలుగా ఎదురుచూడాల్సి వచ్చేదికానీఇవాళ ద్వంద్వ చోదక ప్రభుత్వ కృషితో  గ్రామగ్రామానికీ రహదారి సౌలభ్యం కలుగుతోందిఅందుకే లోగడ నిర్మానుష్యమైన గ్రామాలు నేడు మళ్లీ జీవకళతో విలసిల్లుతున్నాయిచార్‌ధామ్ మహామార్గ్‌రైలు మార్గాల విస్తరణకేదార్‌నాథ్ సహా హేమకుండ్ సాహిబ్ రోప్‌వేఈ విధంగా అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతం నలుమూలలా జీవన గమ్యాలుగా రూపొందుతున్నాయి.

మిత్రులారా!

నేటి 21వ శతాబ్దపు భారత్‌ పని వేగంస్థాయి గురించి యావత్ ప్రపంచం ఇప్పుడు చర్చించుకుంటోందిఈ సందర్భంగా ఉత్తరాఖండ్పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ఢిల్లీ గురించి నేనిప్పుడు ఉటంకిస్తానుకొన్ని వారాల కిందటే ఢిల్లీ మెట్రో విస్తరణ పూర్తికాగామీరట్‌లో మెట్రో సేవలు మొదలయ్యాయిఢిల్లీ-మీరట్ ‘నమో భారత్’ రైలును దేశానికి అంకితం చేయగానోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైందివిమానాల కోసం ‘ఎంఆర్‌ఓ’ సదుపాయం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాంఈ క్రమంలో ఇప్పుడిక డెహ్రాడూన్-ఢిల్లీ ఎక్స్‌ ప్రెస్‌వే ప్రారంభమవుతోంది.

మిత్రులారా!

ఇంత చిన్న ప్రాంతంలో.. ఇంత తక్కువ సమయంలోనే ఇవన్నీ సాగుతున్నాయిదీన్నిబట్టిదేశంలో మౌలిక సదుపాయాల కల్పన ఎంత భారీ స్థాయిలో సాగుతున్నదో ఒక్కసారి ఊహించండిఅందుకే నేనంటానుఈ 21వ శతాబ్దపు భారత ఆధునిక మౌలిక సదుపాయాల నవశకం అపూర్వం.. అనూహ్యం!

మిత్రులారా!

దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే అనేక ఆర్థిక కారిడార్ల కార్యకలాపాలు నేడు కొనసాగుతున్నాయిఈ మేరకు ఢిల్లీ-ముంబైబెంగళూరు-ముంబైతూర్పు తీరంఅమృత్‌సర్-కోల్‌కతా కారిడార్ల వంటివి దేశంలో నిర్మితమవుతున్నాయిఈ ఆర్థిక కారిడార్లే ప్రగతికి కొత్త ద్వారాలు.. ముఖద్వారాలు మాత్రమే కాదు... అందరి ఆశల దారం కూడా వీటితో ముడిపడి ఉందిఈ ఆర్థిక కారిడార్లు  రహదారులతోపాటు కొత్త వ్యాపార-వాణిజ్యాలకు సరికొత్త బాటలు వేస్తాయిఇవన్నీ కర్మాగారాలుగిడ్డంగుల కోసం ఒక పూర్తి నెట్‌వర్క్‌కు పునాది వేస్తాయి.

మిత్రులారా!

డెహ్రాడూన్-ఢిల్లీ ఆర్థిక  కారిడార్ ద్వారా ఈ మొత్తం ప్రాంతం ముఖచిత్రం మారిపోనుందిదీనివల్ల కలిగే మొదటి ప్రయోజనంఇది సమయాన్ని ఆదా చేస్తుంది.  ప్రయాణం ఖర్చు తక్కువగావేగంగా మారుతుందిప్రజల పెట్రోల్డీజిల్ ఖర్చులు తగ్గుతాయిప్రయాణ ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయిఇక రెండవ ప్రధాన ప్రయోజనం ఉపాధి రూపంలో లభిస్తుందిప్రస్తుతం దీని నిర్మాణానికి 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో వేలాది మంది కార్మికులకు పని దొరికిందిదీనితో పాటుఇంజనీర్లుఇతర నైపుణ్యం కలిగిన సిబ్బందిరవాణా రంగంతో సంబంధం ఉన్న భాగస్వాములకు కూడా భారీ స్థాయిలో ఉపాధి లభించిందిఇప్పుడు రైతులుపశుపోషకుల ఉత్పత్తులు కూడా వేగంగా పెద్ద పెద్ద మార్కెట్లకుప్రధాన విపణి కేంద్రాలకు చేరుతాయి.

మిత్రులారా!

ఈ అద్భుతమైన ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి విశేషమైన ప్రయోజనం కలుగుతుందిడెహ్రాడూన్హరిద్వార్రిషికేష్ముస్సోరీచార్‌ధామ్ యాత్రలకు ఇది అత్యంత కీలకమైన మార్గంగా మారుతుందిపర్యాటక రంగం అభివృద్ధి చెందినప్పుడుప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఆదాయం లభిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందేహోటళ్లుదాబా యజమానులుటాక్సీలుఆటోలు లేదా హోమ్‌స్టేలు ఇలా అందరూ దీని ద్వారా లాభపడతారు.

మిత్రులారా!

ఉత్తరాఖండ్ నేడు శీతాకాల పర్యాటకంశీతాకాల క్రీడలు, 'వెడ్ ఇన్ ఇండియావంటి వివాహ వేడుకలకు ఒక అద్భుతమైన గమ్యస్థానంగా మారుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది

మిత్రులారా!

ఉత్తరాఖండ్ ఆర్థిక వ్యవస్థకు ఏడాది పొడవునా కొనసాగే పర్యాటకం చాలా అవసరంఅందుకే శీతాకాలంలో జరిగే ఆధ్యాత్మిక యాత్రల విషయంలో నేను చాలా పట్టుదలగా ఉన్నానుప్రతి సంవత్సరం ఈ యాత్రల్లో పాల్గొనే భక్తుల సంఖ్య పెరుగుతుండటం నాకు ఎంతో సంతోషాన్నిస్తోందిమీకు గుర్తుండే ఉంటుందినేను 2023లో ఆది కైలాసంఓం పర్వతం యాత్రకు వెళ్లానుఅంతకుముందు నేను తరచుగా వెళ్లేవాడినికానీ మధ్యలో అస్సలు వెళ్లలేకపోయానుచాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వెళ్లానునేను 2023లో అక్కడికి వెళ్లిన తర్వాతఅప్పటి నుంచి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారని ముఖ్యమంత్రిగవర్నర్ కూడా నాకు చెప్పారుగతంలో శీతాకాల యాత్ర కోసం అక్కడికి కేవలం వందల సంఖ్యలో మాత్రమే ప్రజలు వెళ్లేవారుకానీ 2025 సంవత్సరంలోసుమారు 40 వేల మందికి పైగా భక్తులు ఈ పవిత్ర స్థలాలను సందర్శించారుఒకప్పుడు వెయ్యి మంది కూడా వెళ్లని చోటికిఇప్పుడు నలభై వేల మంది చేరుకుంటున్నారంటే ఇక్కడి ప్రజల జీవనోపాధికి ఎంతటి బలం చేకూరుతుందో ఆలోచించండిఅదేవిధంగా, 2024 శీతాకాల చార్‌ధామ్ యాత్రలో దాదాపు ఎనభై వేల మంది భక్తులు రాగా, 2025 నాటికి ఈ సంఖ్య లక్షన్నర మార్కును దాటిపోయింది.

మిత్రులారా!

అభివృద్ధిప్రకృతిసంస్కృతి కలిసి ఉండే వికసిత భారతాన్ని నిర్మించే పనిలో మనం నిమగ్నమై ఉన్నాంఅందుకేనేడు జరుగుతున్న ప్రతి నిర్మాణం కూడా అభివృద్ధిప్రకృతిసంస్కృతి తో కూడిన  'త్రివేణివిలువల ఆధారంగానే రూపుదిద్దుకుంటోందిమౌలిక సదుపాయాల వల్ల ప్రజలకు  సౌకర్యం ఉండాలిఅదే సమయంలో అక్కడ నివసించే వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్నదే మా ప్రయత్నంఅందుకే సుమారు 12 కిలోమీటర్ల పొడవునా వన్యప్రాణుల కోసం ఎత్తైన వంతెన మార్గం (ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్‌నిర్మించాంఏనుగులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం

మిత్రులారా!

దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు,  యాత్రికులకు ఈ రోజు నాదో విన్నపంమన పర్వతాలుఈ అటవీ ప్రాంతాలుఈ దేవభూమి వారసత్వం ఇవన్నీ ఎంతో పవిత్రమైన ప్రదేశాలుఇటువంటి ప్రాంతాలను శుభ్రంగానిర్మలంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతఇక్కడ నివసించే వారిదే కాకుండాప్రయాణికులుగా ఇక్కడికి వచ్చే వారి బాధ్యత కూడాఈ ప్రాంతాల్లో ప్లాస్టిక్ సీసాలుచెత్తాచెదారం కుప్పలుగా పడి ఉండటం దేవభూమి పవిత్రతను దెబ్బతీస్తాయిఅందుకే మన దేవభూమిలోని ఈ పుణ్యక్షేత్రాలనుపర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగాఅందంగా ఉంచుకోవడం ఎంతో అవసరం.

మిత్రులారా!

వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా కూడా జరగనుందిఈ భక్తి సంగమాన్ని దివ్యంగాభవ్యంగాఅత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో మనం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకూడదు.  

మిత్రులారా!

ఉత్తరాఖండ్‌లో నందా దేవి రాజ్‌ జాత్ యాత్ర కూడా జరుగుతుందిఇది కేవలం ఒక విశ్వాస పండుగ మాత్రమే కాదుమన సాంస్కృతిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంఇక్కడ నందా దేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించిపూర్తి గౌరవమర్యాదలతో వీడ్కోలు పలుకుతారుఈ యాత్రలో సోదరీమణులుకుమార్తెల భాగస్వామ్యం దీనికి ఒక ప్రత్యేకతను చేకూరుస్తుందినందా మాతకు ప్రణామం చేస్తూదేశవ్యాప్తంగా ఉన్న సోదరీమణులకు కుమార్తెలకు నేను ఒక ప్రత్యేక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానుఅభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో మీ పాత్ర చాలా పెద్దదిఈ దేశపు కుమార్తెలుతల్లులుఅక్కాచెల్లెళ్ల పాత్రను నేను చాలా కీలకంగా చూస్తున్నానుఅక్కాచెల్లెళ్ళుకుమార్తెల సౌకర్యంభద్రతప్రజాస్వామ్యంలో వారి భాగస్వామ్యం  ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంప్రస్తుతం ప్రపంచంలో ఎంతటి పెద్ద సంక్షోభం వచ్చిందో మీరు చూస్తున్నారుదీనివల్ల ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఎంతటి హాహాకారాలు వ్యక్తమవుతున్నాయో మనకు తెలుసుఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడామన ఆడబిడ్డలకు ఎక్కువ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నదే ప్రభుత్వ నిరంతర ప్రయత్నం.

మిత్రులారా!

అక్కాచెల్లెళ్ళు,  కుమార్తెల భాగస్వామ్యంలో మరో ముఖ్యమైన మైలురాయి ఇప్పుడు దేశం ముందుకు వచ్చిందినాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాతపార్లమెంటు 'నారీ శక్తి వందన్ అధినియం'ను ఆమోదించిందిదీని ద్వారా శాసనసభలులోక్‌సభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్‌ ఖరారు అయిందిఈ ముఖ్యమైన చట్టానికి అన్ని పార్టీలు ముందుకు వచ్చి మద్దతు తెలిపాయిఇప్పుడు మహిళలకు ఈ హక్కు లభించినందునదీనిని అమలు చేయడంలో ఏమాత్రం ఆలస్యం జరగకూడదుఇప్పుడు ఇది కచ్చితంగా అమలు కావాలి. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల నుంచిఅలాగే ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల నుంచి ఏ ఎన్నికలు జరిగినాఈ చట్టం 2029 నుంచే అమలులోకి వస్తుందిఇది దేశం మనోభావందేశంలోని ప్రతి సోదరికుమార్తెల ఆకాంక్షఈ మాతృశక్తి ఆకాంక్షకు తలవంచిఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో ఒక ప్రత్యేక చర్చ జరగనుందిరాజకీయ పార్టీలన్నీ కలిసి ఏకాభిప్రాయంతో దేశంలోని అక్కాచెల్లెళ్ళుకుమార్తెల హక్కులకు సంబంధించిన ఈ పనిని ముందుకు తీసుకెళ్లి పూర్తి చేయాలినేడు దేశంలోని సోదరీమణులందరి పేరిట నేను ఒక బహిరంగ లేఖ రాశానుబహుశా సోషల్ మీడియా ద్వారా నా ఈ లేఖ మీ వద్దకు చేరి ఉండవచ్చు.టీవీవార్తాపత్రికల వారు కూడా ఈ లేఖ గురించి ప్రస్తావిస్తూ ఉండవచ్చుఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దేశంలోని తల్లులనుఅక్కాచెల్లెళ్లను నేను మనసారా ఆహ్వానించానుదేశంలోని తల్లులుఅక్కాచెల్లెళ్ళు కచ్చితంగా ఈ లేఖను చదువుతారని నాకు పూర్తి నమ్మకం ఉందివారు అందులోని ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటారుఇంతటి గొప్ప పవిత్ర కార్యం చేసేందుకు 16,17,18 తేదీలలో పార్లమెంటుకు వచ్చే ఎంపీలకు కూడా వారి ఆశీస్సులు లభిస్తాయినేడు ఈ దేవభూమినుంచి దేశంలోని రాజకీయ పార్టీలన్నింటికీ నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానారీ శక్తి వందన్ అధినియం సవరణకు చిత్తశుద్ధితో మద్దతు ఇవ్వండి. 2029 నాటికిమన దేశ జనాభాలో 50 శాతం ఉన్న మన తల్లులుసోదరీమణులుకుమార్తెలకు వారి హక్కును అందిద్దాం.

మిత్రులారా!

నేను ఉత్తరాఖండ్‌కు వచ్చి సైన్యం గురించి మాట్లాడకపోతేఆ ప్రసంగం అసంపూర్ణంగానే మిగిలిపోతుందిఈ గర్హీ కంటోన్మెంట్ఈ సభా వేదిక ఉత్తరాఖండ్ గొప్ప సైనిక సంప్రదాయానికి నిదర్శనంఇక్కడికి సమీపంలో దేశ రక్షణభద్రతకు సంబంధించిన అనేక సంస్థలు ఉన్నాయి. 1962 యుద్ధంలో షహీద్ జస్వంత్ సింగ్ రావత్ ప్రదర్శించిన పరాక్రమాన్ని దేశం ఎన్నటికీ మరువలేదు.

మిత్రులారా!

సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కావచ్చు లేదా మన సైనిక కుటుంబాల సౌకర్యంగౌరవం కావచ్చుమా ప్రభుత్వం వీటి కోసం నిరంతరం కృషి చేస్తోంది. 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' (ఓఆర్ఓపీద్వారా మా ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు లక్షా పాతిక వేల కోట్ల రూపాయలను మాజీ సైనికుల ఖాతాల్లో జమ చేసిందిఉత్తరాఖండ్‌లోని వేలాది కుటుంబాలు కూడా దీని వల్ల ప్రయోజనం పొందాయిఇది కాకుండాఈ ఏడాది మాజీ సైనికుల ఆరోగ్య పథకం (ఈసీహెచ్ఎస్బడ్జెట్‌ను కూడా ముప్పై ఆరు శాతం పెంచాం. 70 ఏళ్లుఅంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మాజీ సైనికుల కోసం ఇంటి వద్దకే మందుల పంపిణీ సౌకర్యాన్ని కూడా ప్రారంభించాంమాజీ సైనికుల పిల్లల విద్యా గ్రాంట్‌ను కూడా రెట్టింపు చేశాంఅలాగేకుమార్తెల వివాహానికి అందించే సహాయాన్ని 50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాం

మిత్రులారా!

దేశభక్తిదైవభక్తిప్రగతి వంటి ప్రతి కోణాన్ని జోడిస్తూ మనం దేశాన్ని వికసిత భారత్‌గా తీర్చిదిద్దాలిమరొకసారి ఢిల్లీ ప్రజలకుఉత్తరప్రదేశ్ ప్రజలకుఅలాగే దేశప్రజలందరికీ ఈ అద్భుతమైన ఎక్స్‌ప్రెస్‌వే సందర్భంగా నా అనేకానేక శుభాకాంక్షలు.  

నాతో కలసి చెప్పండి 

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

 అనేకానేక ధన్యవాదాలు!

గమనికఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం

***


(రిలీజ్ ఐడి: 2252055) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam