పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ


పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహించడానికి రాయితీలను ప్రకటిస్తున్న సీజీడీ సంస్థలు

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్‌పీజీ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ

దాదాపు 84 శాతం నుంచి 90 శాతానికి పెరిగిన ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు

అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు

ఈ రోజు భారత్‌కు చేరుకోనున్న ఎల్‌పీజీ వాహక నౌక 'శివాలిక్'

రేపు ఉదయం 'నందా దేవి' వచ్చే అవకాశం

ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల నుంచి భారత్‌కు తిగిన వచ్చిన సుమారు 2,20,000 మంది ప్రయాణికులు

పూర్తిస్థాయిలో పనిచేస్తోన్న టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 5:09PM by PIB Hyderabad

పశ్చిమాసియా పరిణామాలపై జాతీయ మీడియా కేంద్రంలో క్రమం తప్పకుండా వివిధ మంత్రిత్వ శాఖలు (ఇంటర్‌ మినిస్ట్రీయల్కలిసి మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయిఈ రోజు (2026 మార్చి 16) జరిగిన సమావేశంలో పెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖవిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఓడరేవులు నౌకాయాన జలమార్గాల మంత్రిత్వ శాఖలు.. ఇంధన సరఫరాలుసముద్ర కార్యకలాపాలుఆ ప్రాంతంలోని భారతీయుల సంక్షేమంసంబంధిత సమాచార వ్యాప్తికి చేస్తున్న ప్రయత్నాలపై తాజా వివరాలను వెల్లడించాయిగతంలో మార్చి 11, 12, 13, 14 తేదీల్లో కూడా ఇటువంటి సమావేశాలు నిర్వహించారు.

ఇంధన సరఫరాఇంధన లభ్యత

హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా స్థితిగతులుపెట్రోలియం ఉత్పత్తులునిరంతరం ఎల్‌పీజీ అందుబాటులో ఉండేలా తీసుకుంటున్న చర్యల గురించి పెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖ మీడియాకు వివరించిందిమంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం:

 

 

 

ముడి చమురుచమురు శుద్ధి

అన్ని చమురు శుద్ధి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయటంతో పాటు తగినంత ముడి చమురు నిల్వలను కలిగి ఉన్నాయిపెట్రోల్డీజిల్ ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధిని సాధించిందిదేశీయ అవసరాలను తీర్చడానికి ఈ ఇంధనాల దిగుమతులు ఏవీ అవసరం లేదు.

 

రిటైల్ అవుట్‌లెట్లు

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నివేదించిన ప్రకారం ఏ రిటైల్ అవుట్‌లెట్‌లోనూ ఇంధన కొరత లేదుపెట్రోల్డీజిల్ సరఫరా క్రమబద్ధంగా కొనసాగుతోంది.

 

పెట్రోల్డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నందున ప్రజలు ఎటువంటి ఆందోళనతో కూడిన కొనుగోళ్లు చేయొద్దని సూచించారు.

సహజ వాయువు

ప్రాధాన్యతా రంగాలకు గ్యాస్ సరఫరా కొనసాగుతోందిఇందులో భాగంగా పీఎన్‌జీసీఎన్‌జీ విభాగాలకు 100 శాతం సరఫరా అందుతోందిపారిశ్రామికవాణిజ్య వినియోగదారులకు మాత్రం సరఫరాను సుమారు 80 శాతానికి నియంత్రించారు.

 

ప్రధాన నగరాలుపట్టణ ప్రాంతాల్లోని వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులు పీఎన్‌జీకి మారాలని ప్రోత్సహిస్తున్నారుహోటళ్లురెస్టారెంట్లుఆసుపత్రులుహాస్టళ్ల వంటి సంస్థలు అధీకృత సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీసంస్థల ద్వారా పీఎన్‌జీ కనెక్షన్లను పొందొచ్చు.

 

వినియోగదారులు ఈమెయిల్వినియోగదారు వెబ్‌సైట్లులేఖలు లేదా సీజీడీ సంస్థల కాల్ సెంటర్ల ద్వారా పీఎన్‌జీ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చుపైప్‌లైన్ నెట్‌వర్క్ ఇప్పటికే అందుబాటులో ఉన్న చోట కనెక్షన్లు వేగంగా అందుతాయి.

 

పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహించడానికి పలు సీజీడీ సంస్థలు రాయితీలను అందిస్తున్నాయిఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్గెయిల్ గ్యాస్ లిమిటెడ్‌ గృహ వినియోగదారులకు రూ. 500 విలువైన ఉచిత గ్యాస్ ఇస్తున్నాయిమహానగర్ గ్యాస్ లిమిటెడ్.. గృహ వినియోగదారులకు రూ. 500 రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపువాణిజ్య వినియోగదారులకు సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపు ఇస్తోందిబీపీసీఎల్ విషయంలో అన్ని వాణిజ్య కనెక్షన్‌లకు సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపు ఉంది.

 

ప్రభుత్వం సీజీడీ వ్యవస్థను విస్తరిస్తోందివనరుల వినియోగాన్ని వేగవంతం చేయాలనిప్రస్తుతం ఉన్న కనెక్షన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని.. గ్యాస్ సరఫరా ప్రారంభానికి పట్టే సమయాన్ని తగ్గించాలని పెట్రోలియంసహజ వాయు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీఅన్ని సీజీబీ సంస్థలకు సూచించింది.

ఎల్‌పీజీ

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్‌పీజీ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

 

ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎక్కడా ఇంధన కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.

 

పరిశ్రమ అంతటా ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు దాదాపు 84 శాతం నుంచి సుమారు 90 శాతానికి పెరిగాయి.

 

డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలో సిలిండర్లు పక్కదారి పట్టకుండా అరికట్టడానికి డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీవినియోగాన్ని సంక్షోభానికి ముందు ఉన్న 53 శాతం నుంచి సుమారు 72 శాతానికి విస్తరించారు.

 

భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గృహేతర ఎల్‌పీజీని కేటాయించాలని బీహార్ఢిల్లీహర్యానారాజస్థాన్మణిపూర్మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు ఉత్తర్వులు జారీ చేశాయి.

 

రాష్ట్ర ప్రభుత్వాల సమావేశాలు

పెట్రోల్డీజిల్ఎల్‌పీజీ వంటి నిత్యావసరాల సరఫరాను పర్యవేక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

 

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి మెజారిటీ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాయిప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి మీడియా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నాయి.

 

అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు

పెట్రోల్డీజిల్ఎల్‌పీజీ అక్రమ నిల్వలునల్లబజారు క్రయవిక్రయాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన అమలు చర్యలను చేపడుతున్నాయి.

ఎల్‌పీజీ అక్రమ నిల్వలునల్లబజారు విక్రయాలను తనిఖీ చేయడానికి ఉత్తరప్రదేశ్హర్యానాఆంధ్రప్రదేశ్మధ్యప్రదేశ్అస్సాంమిజోరాం సహా పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తున్నారు.

సరఫరా సాఫీగా సాగేలా చూడటానికిఅక్రమాలను అరికట్టడానికి పీఎస్‌యూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారులు 1,100 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్లుఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర చర్యలు

ముఖ్యంగా గృహాలతో పాటు ఆసుపత్రులువిద్యా సంస్థల వంటి ప్రాధాన్యతా రంగాలకు అంతరాయం లేని ఎల్‌పీజీ సరఫరాను అందించడానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

 

చమురు శుద్ధి కేంద్రాల్లో దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి సుమారు 36 శాతం పెరిగింది.

 

2026 మార్చి 14 నాటి 'ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వుసవరణ ప్రకారం పీఎన్‌జీ కనెక్షన్‌లు ఉన్న వినియోగదారులు తమ ఎల్‌పీజీ కనెక్షన్‌లను తిరిగి అప్పగించాల్సి ఉంటుందివారు కొత్త ఎల్‌పీజీ కనెక్షన్‌లను పొందడానికి వీలుండదు.

 

సమానమైన పంపిణీని నిర్ధారించడానికి సిలిండర్ బుకింగ్ వ్యవధిని పట్టణ ప్రాంతాల్లో 25 రోజులుగ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు సవరించారు.

 

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించారుఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.

 

డిజిటల్ పద్ధతిలో ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్‌లను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రోత్సహిస్తున్నాయిభయాందోళనతో చేసే ముందస్తు బుకింగ్‌లను నిరుత్సాహపరుస్తున్నాయిఅక్రమాలను అరికట్టడానికి సమన్వయంతో కూడిన తనిఖీలు చేపట్టాలని రాష్ట్రకేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలను కోరారు.

 

ప్రజలకు సూచనలు

గృహాలునిత్యావసర రంగాలకు తగినంత ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందికాబట్టి ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దని కోరారు.

 

గతంలో పరిమితం చేసిన వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల విక్రయాలను ఇప్పుడు పాక్షికంగా పునరుద్ధరించారుప్రాధాన్యత ఆధారంగా పంపిణీ చేయడం కోసం వీటిని రాష్ట్రకేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచారు.

 

ఎల్‌పీజీ సిలిండర్లను ఐవీఆర్ఎస్ఎస్ఎంఎస్వాట్సాప్ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్‌లుప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

 

అనవసరమైన ముందస్తు బుకింగ్‌లు చేయొద్దనిడిజిటల్ బుకింగ్ పద్ధతులనే ఉపయోగించాలనిఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలకు అనవసరంగా వెళ్లొద్దని ప్రజలను కోరారు.

 

వినియోగదారులు సాధ్యమైన చోటల్లా పీఎన్‌జీఇండక్షన్ లేదా ఎలక్ట్రిక్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలనిఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు.

 

అంతరాయం లేని ఎల్‌పీజీ రీఫిల్ డెలివరీల గురించి ప్రభుత్వంప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిరంతరం అవగాహన కల్పిస్తున్నాయితప్పుడు సమాచారంఅనవసర భయాందోళనలను నివారించడానికి మీడియా సంస్థలు అధికారిక సంస్థలను మాత్రమే సంప్రదించాలని విన్నవించారు.


 

నౌకా వాణిజ్య భద్రతనౌకాయాన కార్యకలాపాలు

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని నౌకా వాణిజ్య పరిస్థితిభారతీయ నౌకలునావికుల రక్షణ చర్యల గురించి నౌకాశ్రయాలునౌకాయానంజలరవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించిందిమంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలియజేసింది:

· ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ క్షేమంగా ఉన్నారుగత 24 గంటల్లో భారతీయ నావికులకు సంబంధించి ఎటువంటి నౌకా ప్రమాదం నమోదు కాలేదు.

· ప్రస్తుతం, 611 మంది నావికులతో కూడిన 22 భారత పతాకం గల నౌకలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి పశ్చిమాన ఉన్నాయినౌకల యజమానులుఆర్‌పీఎస్ఎల్ ఏజెన్సీలుభారతీయ మిషన్లతో సమన్వయం చేసుకుంటూ నౌకాయాన డైరెక్టరేట్ జనరల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

· ఈ నెల 14న దాదాపు 92,712 ఎమ్‌టీల ఎల్‌పీజీతో హర్మూజ్ జలసంధిని దాటిన రెండు భారతీయ పతాకం గల నౌకల్లో శివాలిక్ నౌక ఈ రోజు సాయంత్రం గంటల ప్రాంతంలో ముంద్రా పోర్టును చేరగాప్రాధాన్యతా విడుదలను నిర్ధారించడానికి డాక్యుమెంటేషన్ పూర్తి చేశారుమరో నౌక నందాదేవి రేపు తెల్లవారుజాము వరకు చేరుకునే అవకాశం ఉంది.

· సుమారు 80,800 ఎమ్‌టీల 'ముర్బాన్ముడి చమురును రవాణా చేస్తున్న భారత పతాకం గల నౌక 'జగ్ లాడ్కీఈ నెల 14న యూఏఈ నుంచి బయలుదేరి ప్రస్తుతం సురక్షితంగా భారత్‌కు ప్రయాణిస్తోందిఈ నౌకతో పాటుఅందులోని భారతీయ నావికులంతా క్షేమంగా ఉన్నారు.

· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి సహాయం కోరుతూ సముద్ర ప్రయాణికులువారి కుటుంబాలునౌకా వాణిజ్య సంబంధిత వర్గాల నుంచి 3,030 ఫోన్ కాల్స్సుమారు 5,497 ఈమెయిళ్లను స్వీకరించివిజయవంతంగా వాటిని పరిష్కరించారుఇందులో గత 48 గంటల్లో వచ్చిన 310కి పైగా కాల్‌లు, 597 ఈమెయిళ్లు ఉన్నాయి.

· డీజీ షిప్పింగ్ ఇప్పటి వరకు గల్ఫ్ ప్రాంతం నుంచి 286 మంది భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించిందిఇందులో గత 48 గంటల్లోనే 33 మందిని తరలించారు.

· దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఓడరేవులు... ఓడల రవాణానుకార్గో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయియాంకరేజ్బెర్త్ అద్దెనిల్వ ఛార్జీల్లో రాయితీలు సహా నౌకాయాన మార్గాలుకార్గో సంబంధిత సంస్థలకూ అవసరమైన సహాయాన్నీ అందిస్తున్నాయి.

· కార్గో కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఓడరేవులు కస్టమ్స్ఇతర వాటాదారులతో సమన్వయం చేసుకుంటున్నాయి.

· జేఎన్‌పీఏ నుంచి మధ్యప్రాచ్యానికి వెళ్లే కంటైనర్ల కోసం జేఎన్‌పీఏ తాత్కాలిక ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్నీ కల్పించిందిఈ కంటైనర్లకు 15 రోజుల వరకు గ్రౌండ్ అద్దెనిల్వ సమయ రుసుములపై 100 శాతంఅలాగే రీఫర్ కంటైనర్ ప్లగ్-ఇన్ రుసుములపై సుమారు 80 శాతం రాయితీని అందిస్తోంది.

· ప్రస్తుతం ఏ ప్రధాన నౌకాశ్రయంలోనూ రద్దీ లేదుఅలాగే జేఎన్‌పీఏ వద్ద ఎగుమతికి సిద్ధంగా ఉన్న కంటైనర్ల సంఖ్య సుమారు 5,600 నుంచి 3,900కు తగ్గింది.

· గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు లోడ్‌తో సిద్ధంగా ఉన్న ఓడలకు ఈ ఓడరేవులు సురక్షితమైన యాంకరేజ్ సౌకర్యం అందిస్తున్నాయి.

· కార్యాచరణ సమస్యలను పరిష్కరించడం కోసం కస్టమ్స్ఓడరేవులుఇతర వాటాదారుల సభ్యులతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆధ్వర్యంలో పలు మంత్రిత్వ శాఖల ప్రాతినిధ్యంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.

· నౌకా వాణిజ్యంఓడరేవు కార్యకలాపాలను కొనసాగిస్తూనే భారతీయ నావికుల భద్రతసంక్షేమాన్ని నిర్ధారించడానికి విదేశాంగ శాఖభారతీయ మిషన్లునౌకాయాన కంపెనీలునౌకా వాణిజ్య వాటాదారులతో మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటూనే ఉంది.

సంక్షోభ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత

ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల స్థితిగతులపై విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించిందిభారత రాయబార కార్యాలయాలు భారతీయ కమ్యూనిటీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నామని తెలియజేసిందితాజాగా ఈ సమాచారాన్ని అందించింది:

· ఇరాన్‌లోని భారతీయ పౌరుల పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉందివారి భద్రతక్షేమం అత్యంత ప్రాధాన్య అంశంగా ఉందిఇరాన్‌లోని 550 మందికి పైగా భారతీయ పౌరులు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో భూ సరిహద్దు ద్వారా అర్మేనియాలోకి ప్రవేశించగా, 90 మందికి పైగా జాతీయులు అజర్‌బైజాన్‌లోకి ప్రవేశించారు.

· టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పూర్తి స్థాయిలో పనిచేస్తోంది.

· గత కొద్ది రోజులుగావారు టెహ్రాన్ వెలుపలి ప్రాంతాల నుంచి భారతీయ విద్యార్థులను ఇరాన్ భూభాగంలోని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

· భారతీయ నావికులుమత్స్యకారులను నియమించే ఇరాన్‌ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు కొనసాగిస్తోందివారి భద్రతను నిర్ధారించడానికి భారతీయ పౌరులంతా రాయబార కార్యాలయ సూచనలను పాటించాలని సూచించారు.

· పశ్చిమ ఆసియాగల్ఫ్ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశాంగ మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉందిభారతీయ పౌరుల భద్రతక్షేమంరక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలుగా కొనసాగుతున్నాయి.

· భారత పౌరులువారి కుటుంబాల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఎమ్ఈఏ కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉందిరాష్ట్ర ప్రభుత్వాలుకేంద్ర పాలిత ప్రాంతాలతోనూ సమన్వయం కొనసాగుతోంది.

· ఈ ప్రాంతమంతటా ఉన్న భారత మిషన్లుపోస్టులు 24×7 హెల్ప్‌లైన్లను నిర్వహిస్తూభారతీయ కమ్యూనిటీకి చెందిన సంస్థలతో సంబంధాలను కొనసాగిస్తూతాజా సూచనలను జారీ చేస్తూనే ఉన్నాయి.

· స్థానిక అధికారులతో మిషన్లు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూఒంటరిగా ఉన్న భారతీయులకుస్వల్పకాలిక సందర్శకులకు వీసాపరమైన సహాయంలాజిస్టిక్ సహాయంరవాణా సౌకర్యాలనూ అందిస్తున్నాయిఈ ప్రాంతంలోని భారతీయ నావికులకు సహాయం చేయడానికి నౌకాశ్రయాలునౌకాయానంజలరవాణా మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తున్నాయి.

· 2026 ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియాగల్ఫ్ ప్రాంతాల నుంచి సుమారు 2,20,000 మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి వచ్చారు.

· యూఏఈలో ఈ రోజు ఉదయం తాత్కాలికంగా నిలిచిపోయిన విమాన కార్యకలాపాలు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్రమంగా తిరిగి ప్రారంభమవుతున్నాయి.

· అబుదాబిరస్ అల్ ఖైమాఫుజైరా నుంచి భారతీయయూఏఈ విమానయాన సంస్థల విమానాలు పరిమిత సంఖ్యలో నడుస్తున్నాయిఅందుబాటులో ఉన్న సమాచారం ప్రకారంఈ రోజు భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు 45కి పైగా విమానాలు నడిపేందుకు ప్రణాళిక రూపొందించారు.

· తాజా షెడ్యూల్‌ల కోసం ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలనీసహాయం కోసం అబుదాబిలోని భారత రాయబార కార్యాలయాన్నిదుబాయ్‌లోని కాన్సులేట్‌ను 24×7 హెల్ప్‌లైన్‌ల ద్వారా సంప్రదించాలని సూచించారు.

· సౌదీ అరేబియాఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలు నడుస్తున్నాయి.

· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచే ఉందిఈ రోజురేపు ఖతార్ ఎయిర్‌వేస్ విమానాలను భారత్‌కు నడుపుతుందని భావిస్తున్నారు.

· 2026 ఫిబ్రవరి 28 నుంచి కువైట్ గగనతలం మూసి ఉందిసౌదీ అరేబియాలోని అల్ ఖైసుమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్‌కిజజీరా ఎయిర్‌వేస్ ద్వారా ప్రత్యేకషెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలు నడుస్తాయని భావిస్తున్నారు.

· గగనతలం మూసి ఉన్న బహ్రెయిన్ఇరాక్‌లలోని భారతీయ పౌరుల కోసంసౌదీ అరేబియా మీదుగా ప్రయాణ సదుపాయం కల్పించడం కొనసాగుతోంది.

· ఈ నెల 13న ఒమన్‌లోని సోహార్ నగరంలో జరిగిన దాడిలో ఇద్దరు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో... మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలతోనూసంబంధిత ఒమన్ అధికారులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందిమృతదేహాలను స్వదేశానికి త్వరలోనే తరలిస్తారని భావిస్తున్నారుగాయపడిన భారతీయ పౌరుల ఆరోగ్య పరిస్థితినీ రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తోందివీరిలో ఎవరికీ ప్రాణాంతక గాయాలు కాలేదు.

· 'సేఫ్‌సీ విష్ణునౌకకు చెందిన 15 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా తరలించారువారు ప్రస్తుతం బాస్రాలోని ఒక హోటల్‌లో బస చేస్తుండగాస్థానిక మిషన్ బృందం వారికి అవసరమైన సహాయం అందిస్తోందివారిని త్వరగా భారత్‌కు తిరిగి పంపేందుకుమరణించిన భారతీయ పౌరుడి భౌతిక కాయాన్ని స్వదేశానికి తరలించేందుకు ఈ మిషన్ బృందం ఇరాక్ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది.

పశ్చిమాసియాలో పరిణామాలను పర్యవేక్షిస్తూనే ఉంటామనీ... సంబంధిత మంత్రిత్వ శాఖలుఏజెన్సీల మధ్య సమన్వయాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం పునరుద్ఘాటించిందికీలక రంగాల్లో సంసిద్ధతను నిర్ధారించడానికిజాతీయ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2240966) సందర్శకుల సూచీ సంఖ్య : : 23